కేవలం రూ.6,999 ధరలో కొత్త 32 ఇంచ్ LED టీవీ ని లాంచ్ చేసిన Detel
ఈ డీటేల్ 32 అంగుళాల LED టీవీ Dolby Digital సౌండ్ టెక్నలాజితో వస్తుంది
దీపావళి సందర్భంగా, డీటేల్ కేవలం బడ్జెట్ ధరలోతన కొత్త 32 అంగుళాల LED టీవీని ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు లాంచ్ చేసిన ఈ LED టీవీ HD రెడీ పిక్సెల్ రిజల్యూషన్, A+ గ్రేడ్ ప్యానల్ మరియు రెండు 10 వాట్స్ స్పీకర్లతో వస్తాయి. అంటే, మంచి పిక్చెర్ క్వాలిటీతో పాటుగా పెద్ద సౌండ్ అందించగల స్పీకర్లతో ఈ కొత్త LED టీవీలను తీసుకొచ్చింది.
ఈ కొత్త HD Ready LED టీవీలో మంచి సౌండ్ టెక్నలాజితో కూడా అందించింది. ఎందుకంటే, ఈ డీటేల్ 32 అంగుళాల LED టీవీ Dolby Digital సౌండ్ టెక్నలాజితో వస్తుంది. అలాగే, ఇది A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు 3,00,00:1 కాంట్రాస్ట్ రేషియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ HDMI మరియు USB పోర్ట్స్ వాటి కనెక్టివిటీలతో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ ప్రీ లోడెడ్ గేమ్స్ మరియు పవర్ ఆడియో కంట్రోల్ తో పాటుగా PC కనెక్టవిటీ తో వస్తుంది.
సంస్థ యొక్క ఫౌండర్ మరియు CEO అయినటువంటి, యోగేష్ భాటియా, ఈ LED లాంచ్ సమయంలో దీన్ని గురించి మాట్లడుతూ, కేవలం రూ.3,999 రూపాయల ధరలో ముందుగా తీసుకొచ్చినటువంటి 17 అంగుళాల LED పైన వినియోగదారుల స్పందనను అనుసరించి, ఈ 32 అంగుళాల LED టీవీని తీసుకొచ్చాము. అదికూడా, వారి బడ్జెట్ లో తగిన ఫీచర్లతో ఈ టీవీని తెచ్చినట్లుగా చెప్పారు. ఈ టీవీ ఇప్పుడు మర్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.