పేలిన షావోమి స్మార్ట్ ఫోన్ : కారణం తెలిపిన షావోమి
షావోమి కస్టమర్ కేంద్రం మాత్రం తగిన విధంగా స్పందించలేదని కస్టమర్ పేర్కొన్నారు.
చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు షావోమి దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్ ఫోన్ తయారీదారులలో ఒకరు. దీని పరికరాలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ఈ చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు వరుసగా 10 త్రైమాసికాలలో భారతదేశంలో టాప్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా నిలిచింది. ఏదేమైనా, భారతదేశంలో పెరుగుతున్న విజయం కూడా వివాదాలకు దారితీసింది. వాటిలో అతిపెద్ద వివాదం ఏమిటంటే, షావోమి యొక్క స్మార్ట్ ఫోన్లు పేలిపోవడం లేదా మంటలు చెలరేగడం వాటివని చెప్పొచ్చు. ప్రస్తుతం వచ్చిన కొత్త కధనం ప్రకారం, గుర్గావ్ కి చెందిన ఒక వ్యక్తి తన రెడ్మి నోట్ 7 ప్రో అనుకోకుండా పేలిన సంఘటనను నివేదించాడు.
Survey91 మొబైల్స్ నివేదికలో, గుర్గావ్ కు చెందిన వికేష్ కుమార్ తన జేబులో వుంచిన ఫోన్ వేడెక్కిన క్షణాల్లోనే పేలిందని పేర్కొన్నాడు. బ్యాటరీ పేలుడే ఈ పేలుడుకు కారణంగా మరియు అతని బ్యాగ్కు నిప్పంటించిందని ఈ నివేదిక పేర్కొంది. కుమార్ 2019 డిసెంబర్లో ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేశాడని, ఎప్పుడూ బండిల్ చేసిన ఛార్జర్ను ఉపయోగించి స్మార్ట్ ఫోనును ఛార్జ్ చేస్తాడని పేర్కొన్నాడు. కుమార్ కు శారీరకంగా హాని జరగకపోయినప్పటికీ, షావోమి కస్టమర్ కేంద్రం మాత్రం తన జరిగిన ప్రమాదానికి తగిన విధంగా స్పందించలేదని ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటన శుక్రవారం జరిగింది మరియు ఈ పేలుడు సంభవించినందుకు కస్టమర్ సెంటర్ మాత్రం తననే నిందించిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అతను "మరొక కొత్త ఫోన్ కోసం డబ్బును దోచుకోవడానికి ప్రయత్నించాడు" అని వారన్నారని కూడా చెప్పాడు. వికేశ్ కుమార్ ఈ సంఘటనను తనతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక పోస్ట్ను పోస్ట్ చేశారు. గుర్గావ్ కు చెందిన వ్యక్తి 91 మొబైల్స్తో మాట్లాడుతూ, తన కార్యాలయానికి చేరుకున్నప్పుడు స్మార్ట్ ఫోన్ 90 శాతం ఛార్జ్లో ఉందని చెప్పారు. స్మార్ట్ఫోన్ యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోందని అతను భావించాచి, అతను తన జేబులో నుండి ఫోన్ను తీసాడు.
ఫోన్ నుండి పొగ రావడం చూసిన వెంటనే జేబులో నుంచి ఫోన్ను తీశానని వికేశ్ కుమార్ చెప్పాడు. ఆ తర్వాత పరికరాన్ని సమీపంలో ఉన్న తన బ్యాగ్ వైపు విసిరాడు. ఈ సమయంలో, స్మార్ట్ఫోన్ పేలింది మరియు బ్యాగ్ మొత్తం మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పివేసే యంత్రాన్ని ఉపయోగించి బయటకు తీయలేని విధంగా మంటలు పెరిగాయి. కుమార్ అప్పుడు నగరానికి చెందిన సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ప్రశ్నించగా, అక్కడి అధికారులు అతన్ని దోషిగా నిర్ధారించడానికి ప్రయత్నించారు. అతను దానిగురించి మరింతగా ప్రశ్నించడంతో , సేవా కేంద్రం అతనికి స్మార్ట్ ఫోన్ ధరలో 50 శాతం ఇవ్వడానికి ప్రయత్నించింది.
ఈ పరికరాన్ని సేవా కేంద్రానికి తీసుకురాకముందే శారీరకంగా దెబ్బతిన్నట్లు షావోమి తెలిపింది. "ఈ విషయం కస్టమర్ తో స్నేహపూర్వకంగా పరిష్కరించబడింది, పూర్తి వినియోగదారు సంతృప్తిని నిర్ధారిస్తుంది. షావోమి ఒక ప్రకటనలో, మేము మా వినియోగదారులను చాలా జాగ్రత్తగా చూసుకుంటాము మరియు అవసరమైన అన్ని సహకారాన్ని అందిస్తున్నాము, ని పేర్కొంది.