Redmi నుండి వస్తున్న మరొక రెండు కొత్త స్మార్ట్ టీవీలు..ఫీచర్లు అదుర్స్..!

Redmi నుండి వస్తున్న మరొక రెండు కొత్త స్మార్ట్ టీవీలు..ఫీచర్లు అదుర్స్..!
HIGHLIGHTS

Redmi రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తోంది

Android 11 OS తో లాంచ్

IMDb తో లేటెస్ట్ PatchWall 4

Redmi ఇండియాలో రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తోంది.  రెడ్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీలను సెప్టెంబర్ 22 వ తేది మద్యహ్నం 12 గంటలకు ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా విడుదల చేస్తోంది. ఈ టీవీలను Android 11 OS తో లాంచ్ చేస్తున్నట్లు షియోమి ప్రకటించింది. కేవలం ఇది మాత్రమే కాదు మంచి సౌండ్ టెక్నాలజి మరియు మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్ చేస్తున్నట్లు టీజ్ చేస్తోంది. మరి ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ ల గురించి చూద్దాం.

రెడ్ మీ ఈ స్మార్ట్ టీవీలను రెండు సైజుల్లో ఆవిష్కరించనుంది. వాటిలో 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీవీలను అల్ రౌండ్ ఎంటర్టైన్ మెంట్ అందించే విధంగా తీసుకువస్తునట్లు వెల్లడించింది. ఈ టీవీలను Android 11 OS తో లాంచ్ చేస్తున్నట్లు టీజ్ చేస్తోంది. అయితే, ఈ రేండు టీవీలలో ఏటీవికి ఈ లేటెస్ట్ OS అందిస్తుందని ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ టీవీల ను IMDb తో లేటెస్ట్ PatchWall 4 తో అందిస్తుంది.

సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ టీవీలను Dolby Audio మరియు DTS-X Virtual సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో తీసుకువస్తునట్లు టీజ్ చేసింది. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 మరియు మరిన్ని అప్షన్ లను కూడా టీవీలకు జోడించింది. మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ టీవీలలో Vivid పిక్చర్ ఇంజన్ కూడా ఉన్నట్లు రెడ్ మీ ప్రకటించింది. ఈ టీవీల కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ అందించింది. అంటే, ఈటీవీలు అమెజాన్ ప్రత్యేకంగా లభిస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo