Jio True 5G: ఆంధ్రప్రదేశ్ లోని మరో 7 నగరాలకు అందిన 5G నెట్ వర్క్.!

Jio True 5G: ఆంధ్రప్రదేశ్ లోని మరో 7 నగరాలకు అందిన 5G నెట్ వర్క్.!
HIGHLIGHTS

రిలియన్స్ జియో 5G నెట్ వర్క్ ను మరొక 50 నగరాల్లో ఈరోజు ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ యొక్క 7 నగరాలు కూడా ఉన్నాయి

దేశవ్యాప్తంగా మొత్తం 184 నగరాలలో జియో 5G నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకువచ్చింది

రిలియన్స్ జియో 5G నెట్ వర్క్ ను మరొక 50 నగరాల్లో ఈరోజు ప్రకటించింది. ఇందులో, ఆంధ్రప్రదేశ్ యొక్క 7 నగరాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే దేశంలో మొత్తం 134 నగరాలలో Jio True 5G అందుబాటులో ఉండగా, ఇప్పుడు మరో 50 నగరాలలో కూడా Jio True 5G సర్వీస్ లను లాంచ్ చేసింది. అంటే, దేశవ్యాప్తంగా మొత్తం 184 నగరాలలో జియో 5G నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 

రిలయన్స్ జియో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం మరియు విజయనగరం సిటీలలో Jio True 5G సర్వీస్ ను ప్రారంభించింది. ఇప్పటికే, ఆంధ్రప్రదేశ్ లోని 9 నగరాలలో 5G నెట్ వర్క్ అమలులోకి రాగా, ఇప్పుడు కొత్తగా జత ప్రకటించిన ఈ 7 సిటీలతో కలుపుకొని మొత్తం 16 నగరాలలో జియో 5G నెట్ వర్క్ వినియోగంలోకి వచ్చింది. 

ఇప్పుడు Jio True 5G అందుబాటులోకి వచ్చిన నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందవచ్చని కూడా జియో వెల్లడించింది.

మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo