ఈ రోజు జరగనున్న షావోమి ట్రిమ్మర్ యొక్క మొదటి సేల్

Updated on 27-Jun-2019
HIGHLIGHTS

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి mi.com మరియు అమేజాన్ ఇండియా నుండి మొదలవుతుంది.

కేవలం 5 నిముషాల ఛార్జింగ్ తో 10 నిముషాల వరకూ వాడుకోవచ్చు.

ఈ ట్రిమ్మర్ ధరను రూ.1,199 రూపాయలుగా ప్రకటించింది.

రెండు రోజుల క్రితం, గొప్ప ఫీచర్లతో ఇండియాలో షావోమి సంస్థ విడుదల చేసినటువంటి ట్రిమ్మింగ్ మిషన్ యొక్క మొదటి సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి mi.com మరియు అమేజాన్ ఇండియా నుండి మొదలవుతుంది. ముందుగా, సంస్థ యొక్క వెబ్ పేజీలో ఈ లాంచ్ కార్యక్రమాన్ని అందించింది. ఇందులో సంస్థ యోక్క వైస్ ప్రసిడెంట్ మరియు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి, మనూ కుమార్ జైన్, ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసారు.

ఇక ఈ ట్రిమ్మింగ్ మిషన్ యొక్క విశేషాల్లోకి వెళితే, ఇది 40 రకాలైన పొడవును ఎడ్జెస్టుమెంట్ చేసుకునేలా అందించినట్లు షావోమి పేర్కొంది. అలాగే, ఇందులో అందించిన ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 5 నిముషాల ఛార్జింగ్ తో 10 నిముషాల వరకూ వాడుకోవచ్చు. అయితే, పూర్తి ఛార్జింగుతో అత్యధికంగా 90 నిముషాల వరకూ వాడుకోవచ్చని ఈ లంచ్ ఈవెంట్లో తెలియచేశారు.

ముఖ్యంగా, ఇది డ్యూరబిలిటీ విషయంలో చాల మన్నికైనదని తెలుస్తోంది. గట్టిదనంలోనే కాకుండా నీటిలో కూడా వాడుకునేలా దీన్ని అందించింది. ఇది IPX7 వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో వస్తుంది. కాబట్టి నీటిలో తడిచినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడడానికి చాలా స్టైలిష్ డిజైనుతో కనిపిస్తుంది మరియు ఒక్క చేత్తో కావాల్సిన పాయింట్స్ సెట్ చేసుకునేలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ట్రిమ్మర్ ధరను రూ.1,199 రూపాయలుగా ప్రకటించింది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :