Jio సంస్థ, ఫీచర్ ఫోన్ ధరకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ప్రకటించనుందా?

Jio సంస్థ, ఫీచర్ ఫోన్ ధరకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ప్రకటించనుందా?
HIGHLIGHTS

జియో ఇప్పటికే LAVA వంటి స్మార్ట్ ఫోన్ తయారీదారులతో పాటు Foxconn మరియు Wistron సహా ప్రపంచ అగ్రశ్రేణి తయారీదారులను సంప్రదించినట్లు ఈ నివేదిక పేర్కొంది

జియో ఇప్పటికే LAVA వంటి స్మార్ట్ ఫోన్ తయారీదారులతో పాటు Foxconn మరియు Wistron సహా ప్రపంచ అగ్రశ్రేణి తయారీదారులను సంప్రదించినట్లు ఈ నివేదిక పేర్కొంది

ఈ సరసమైన స్మార్ట్ ‌ఫోన్ ‌లు కూడా ప్రత్యేకమైన డేటా ప్యాక్ ‌లతో పాటుగా మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్నారు.

రిలయన్స్ జియో భారతదేశంలో 100 మిలియన్లు, అంటే 10 కోట్లకు పైగా ఎంట్రీ లెవల్ సరసమైన స్మార్ట్‌ ఫోన్ ‌లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో స్మార్ట్ ‌ఫోన్ తయారీని అవుట్సోర్స్ చేయాలని యోచిస్తోంది. ఈ మాటను, బిజినెస్ స్టాండర్డ్ యొక్క ఒక కొత్త రిపోర్ట్ , "తెలిసిన మూలాలను" ఉదహరిస్తూ రిపోర్ట్ చేసింది.   

జియో ఇప్పటికే LAVA వంటి స్మార్ట్ ఫోన్ తయారీదారులతో పాటు Foxconn మరియు Wistron సహా ప్రపంచ అగ్రశ్రేణి తయారీదారులను సంప్రదించినట్లు ఈ నివేదిక పేర్కొంది. జియో మరియు గూగుల్ అభివృద్ధి చేసిన ఈ సరసమైన స్మార్ట్ ‌ఫోన్ ‌లు కూడా ప్రత్యేకమైన డేటా ప్యాక్ ‌లతో పాటుగా మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్నారు.

రిలయన్స్ జియో ఈ డిసెంబర్ లేదా జనవరి ఆరంభంలో 100 మిలియన్ల తక్కువ-ధర ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ ఫోన్‌ లను విడుదల చేయగలదని ఈ  కొత్త రిపోర్ట్  తెలిపింది. ఇందుకు కారణం కూడా వుంది. అదేమిటంటే, జూలై లో కొత్తగా సమీకరించబడిన జియో ప్లాట్ ‌ఫాంలు రూ .33,737 కోట్ల పెట్టుబడిని అందుకున్నాయి. గూగుల్ మరియు జియో, మన దేశంలో ఇంకా 2G నెట్ వర్క్ పరిమితులకే పరిమితమైన 350 మిలియన్ వినియోగదారులను లేటెస్ట్ ఆండ్రాయిడ్ తో నడుస్తున్న బడ్జెట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ ఫోన్‌ దిశగా అభివృద్ధి చేయడానికి సహకరించవచ్చు.

Jio AGM 2020 ప్రకటన

ఫీచర్ ఫోన్‌ లను ఉపయోగించే 2G  చందాదారుల కోసం సరసమైన ఫోన్ ‌లను అభివృద్ధి చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించడంతో జియో ఈ చర్య తీసుకోనున్నట్లు అర్ధమవుతోంది. భారతదేశం ఇప్పటికీ 350 మిలియన్ 2G వినియోగదారులకు నివాసంగా ఉంది, అయితే 4 జి స్మార్ట్ ‌ఫోన్ యొక్క సగటు ధర ఇప్పటికీ 4,000 రూపాయలకు పైగా ఉంది, ఇక్కడ జియో మొదటిసారి స్మార్ట్‌ ఫోన్ వినియోగదారుల కోసం తయారుచేసిన సరసమైన ఫోన్ ‌లతో సమతుల్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2 జి నెట్ ‌వర్క్ ‌లోని ఈ వినియోగదారులు Vi (వోడాఫోన్-ఐడియా), ఎయిర్‌టెల్ మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కనెక్షన్లతో ఉన్నారు.

JioPhone 2 ప్రకటన

ప్రస్తుతమున్న 2 జి చందాదారులు స్మార్ట్‌ ఫోన్ లేదా 4 జి నెట్‌ వర్క్ ‌కి అప్ ‌గ్రేడ్ అయినప్పుడు, ఇతర టెల్కోల కంటే జియోను ఎన్నుకోవటానికి ప్రజలను ప్రలోభపెట్టడానికి జియో, తన సరసమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయని మరిన్ని ఉండాలని రిలయన్స్ కోరుకుంటుంది. స్మార్ట్ ఫోన్ విభాగంలో రిలయన్స్ జియో యొక్క ప్రయత్నం జూలై 2017 లో జియో ఫోన్ తో మొదలయ్యింది మరియు తిరిగి జూలై 2018 లో జియో ఫోన్ 2 తరువాత మరింతగా పెరిగింది. ఈ రెండు ఫీచర్ ఫోన్లతో, జియో 100 మిలియన్లకు పైగా వినియోగదారులను ఆకర్షించగలిగింది, అయితే, ఇప్పుడు ఫీచర్ ఫోన్లలోని వినియోగదారులు కూడా స్మార్ట్ ‌ఫోన్ వినియోగదారులుగా మార్చాలని చూస్తోంది.

రిలయన్స్ తన digital arm Jio Platforms క్రింద వివిధ కంపెనీలు మరియు ఫేస్ బుక్ , గూగుల్, సిల్వర్ లేక్, క్వాల్కమ్ వంటి పెట్టుబడి సంస్థల నుండి రూ .152,000 కోట్లకు పైగా సేకరించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo