Vodafone కొత్త ఆఫర్, మైక్రోమ్యాక్స్ ఎంపిక చేసుకున్న స్మార్ట్ఫోన్లలో రూ. 2,200 క్యాష్ బ్యాక్ అందిస్తోంది
వోడాఫోన్ మైక్రోమ్యాక్స్ తో ఒకపార్టనర్ షిప్ ని ప్రకటించింది మరియు మైక్రోమ్యాక్స్ యొక్క ఎంట్రీ-లెవల్ 4G స్మార్ట్ఫోన్లలో రూ .2,200 యొక్క క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 1, మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్, మైక్రోమ్యాక్స్ భారత్ 3, మైక్రోమ్యాక్స్ భారత్ 4 స్మార్ట్ఫోన్లలో వోడాఫోన్ క్యాష్బ్యాక్ అందిస్తోంది.
Surveyక్యాష్బ్యాక్ కి అర్హత పొందాలంటే, వినియోగదారులకు పైన పేర్కొన్న ఫాన్లు 36 నెలల వరకు నెలకు 150 రూపాయలు రీఛార్జి చేయాలి. 18 నెలల తర్వాత వినియోగదారులు 900 రూపాయల క్యాష్బ్యాక్ పొందుతారు, మిగిలిన 18 నెలల తరువాత మిగిలిన 1,300 రూపాయలు అందుబాటులోకి వస్తాయి . ఈ విధంగా, వినియోగదారులు రూ .2200 క్యాష్ బ్యాక్ ను పొందుతారు, ఇది యూజర్ యొక్క వోడాఫోన్ M- మనీ వాలెట్లో వస్తాయి.ఈ ఆఫర్ గురించి వొడాఫోన్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అనోనీష్ ఖోస్లా చెప్పారు: "ఇది వోడాఫోన్ సూపర్ నెట్ 4G కి ప్రజల వద్దకు తీసుకురావడానికి ఇది ఒక చొరవ. ఇటీవలే, మైక్రోమ్యాక్స్ భాగస్వామ్యంతో, రూ 999 ఆకర్షిత ధరలో లభించే ధరతో కూడిన స్మార్ట్ఫోన్ ని మేము ప్రారంభించాము. మేము ఇప్పుడు మా వినియోగదారులకు 4 ఎంట్రీ లెవెల్ మైక్రోమ్యాక్స్ 4G స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆప్షన్ ని ఇస్తున్నాము .
మైక్రోమ్యాక్స్ భారత్ 2 ప్లస్ రూ. 3,749 రూపాయల ధరకే ప్రారంభించగా, అయితే క్యాష్బ్యాక్ ని కలిపి 1,549 రూపాయలు , భారత్ 3 అండ్ భారత్ 4 లు వరుసగా రూ .4,499 మరియు , రూ. Rs 4,999 ధరలలో లాంచ్ చేయబడ్డాయి అయితే, క్యాష్బ్యాక్ ఆఫర్ తర్వాత, వాటి ధర రూ 2,299 మరియు రూ .2,799 గా ఉంటుంది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 1 ధర 5,999 కానీ క్యాష్ బ్యాక్ తర్వాత రూ. 3,799 ఉంటుంది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile