JioBook పేరుతో అత్యంత చవక ధరకే ల్యాప్ టాప్స్ తెస్తోంది

HIGHLIGHTS

ఇక ల్యాప్ టాప్స్ విభాగంలోకి కూడా జియో

జియో 4G నెట్వర్క్ తో నేరుగా పనిచేస్తాయి

JioOS తో పనిచేస్తాయి

JioBook పేరుతో అత్యంత చవక ధరకే ల్యాప్ టాప్స్ తెస్తోంది

ఇండియాలో 4G సర్వీసులను ఉచితంగా పరిచయం చేసి అందరిని ఆశ్చర్యపరిచిన రిలయన్స్ జియో, ఇప్పుడు మరొక వార్త ద్వారా అందిరిని మరోక్కసారి సర్ప్రైజ్ చెయ్యచ్చని తెలుస్తోంది. ముందుగా, 4G సర్వీస్ లను తరువాత తక్కువ ధరకే 4G ఫోన్లను ప్రకటించిన జియో మరొక కొత్త ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు పక్కాగా తెలుస్తోంది. అదే, జియో ల్యాప్ టాప్స్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

XDA డెవలపర్స్ ఈ ల్యాప్ టాప్ రాక గురించి కీలకమైన సమాచారాన్ని వెల్లడించింది. దీని ప్రకారం, చాలా తక్కువ ధరకే అందరికి అందుబాటులో ఉండేలా  'జియో బుక్'  పేరుతో జియో ల్యాప్ టాప్స్ తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సూచింది. వీటి ధరను దృష్టిలో పెట్టుకొని, విండోస్ OS తో కాకుండా గూగుల్ OS తో పనిచేసే విధంగా వీటిని తయారు చెయ్యవచ్చని చెబుతోంది. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్స్ ఆండ్రాయిడ్ యొక్క కస్టమ్ వెర్షన్ తో పనిచేస్తాయని, దీని JioOS గా పరిచయం చేస్తుంది.

ముఖ్యంగా, జియో ఇప్పటికే ఈ ల్యాప్ టాప్స్ తయారు చేసే పనిలో పడినట్లు ఒక నమూనా లీప టాప్ తయారు చేసినట్లు కూడా ఈ నివేదిక చెబుతోంది. ఈ ప్రోటోటైప్ ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ 665 ప్రాసెసర్ తో ఉన్నట్లు సూచింది. ఈ చిప్ సెట్ ఇన్ బిల్ట్ 4G మోడెమ్ తో     వస్తుంది కాబట్టి ఈ జియో బుక్ ల్యాప్ టాప్ నేరుగా జియో 4G నెట్వర్క్ కు కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదే గనుక నిజమైతే, ఈ జియో ల్యాప్ టాప్స్ మార్కెట్లో ఒక కొత్త వరవడని తీసుకువస్తాయి.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo