జియోనీ, ఈ బుధవారం ఒక కొత్త స్మార్ట్ఫోన్ అయినటువంటి, Gionee F9 Plus ను రూ .7,690 ధరకు విడుదల చేసింది. ఈ సంస్థ, ఏడు నెలల తర్వాత ప్రారంభించిన స్మార్ట్ ఫోన్ ఇది. జియోనీ ఎఫ్ 9 ప్లస్ స్మార్ట్ ఫోన్ను త్వరలోనే కంపెనీ యొక్క భాగస్వామ్య రిటైలర్లు విక్రయించనున్నారు, అలాగే ఈ ఫోన్ ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో కూడా అమ్మకం కానుంది. వైర్లెస్ హెడ్హోన్స్, వైర్డ్ హెడ్ఫోన్స్ మరియు పవర్ బ్యాంక్లను కలిగి ఉన్న GBuddy సిరీస్ ఉపకరణాలను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.
జియోనీ ప్రకారం, ఎఫ్ 9 ప్లస్ రెండు రంగులలో అందించబడుతుంది. జిబుడ్డీ ఉపకరణాల ధర ఇంకా వెల్లడించనప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధరను మాత్రం రూ .7,690 గా నిర్ణయించింది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ జియోనీ ఎఫ్ 9 ప్లస్ ఒక 6.26-అంగుళాల HD + డిస్ప్లేను పైన ఒక వాటర్డ్రాప్ నోచ్ డిజైనుతో కలిగివుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 1.65GHz వద్ద క్లాక్ చేయబడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్తో పనిచేస్తుంది మరియు 3GB RAM తో జతచేయబడుతుంది.
ఈ స్మార్ట్ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ పరికరంలో సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. జియోనీ ఎఫ్ 9 ప్లస్ 4,050 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.