శామ్సంగ్ ఇండియాలో మరొక 5G స్మార్ట్ ఫోన్ ను సైలెంట్ విడుదల చేసింది. అదే, Glaxy A23 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ యొక్క వివరాలను కంపెనీ అధికారిక వైబ్సైట్ లో అందించింది.అయితే, ఈ ఫోన్ యొక్క రేటు మరియు సేల్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. శామ్సంగ్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
శామ్సంగ్ గెలాక్సీ ఎ23 స్మార్ట్ ఫోన్ ఒక 6.4 అంగుళాల FHD+ రిజల్యూషన్ కలిగిన ఇన్ఫినిటీ – V డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ ను ఇంకా వెల్లడించలేదు కానీ, ఇది 5G ఆక్టా కోర్ ప్రొసెసరు యొక్క శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ 4GB, 6GB మరియు 8GB మూడు ర్యామ్ ఎంపికలలో లభిస్తుంది. Galaxy A23 5G స్మార్ట్ ఫోన్ లో 5,000 mAh పెద్ద బ్యాటరీ మరియు బ్లూటూత్ v5.1 కనెక్టివిటీతో డ్యూయల్-బ్యాండ్ వైఫై ఉన్నాయి.
ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP మైన్ కెమెరా, 5MPఅల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది.
ప్రస్తుతానికి, Samsung Galaxy A23 5G యొక్క ధర మరియు సేల్ గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.