ఒక్కసారి ఛార్జింగ్ తో 200 కి.మీ దూరం ప్రయాణం చేసే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్చ్ 24న వస్తోంది..!!

HIGHLIGHTS

Okinawa తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ను మార్చ్ 24 న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

Okhi 90 ఒక్క ఛార్జింగ్ తో 200 కి.మీ దూరం ప్రయాణం చేస్తుందని కంపెనీ తెలిపింది

90 km/h టాప్ స్పీడ్ తో ప్రయాణించగలదని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది

ఒక్కసారి ఛార్జింగ్ తో 200 కి.మీ దూరం ప్రయాణం చేసే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్చ్ 24న వస్తోంది..!!

భారతీయ e-స్కూటర్ తయారీ సంస్థ Okinawa తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్చ్ 24 న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. Okhi 90 పేరుతో తీసుకువస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఛార్జింగ్ తో 200 కి.మీ దూరం ప్రయాణం చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది మాత్రమే కాదు, ఈ ఓకి 90 ఎలక్ట్రిక్ స్కూటర్ 90 km/h టాప్ స్పీడ్ తో ప్రయాణించగలదని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Okinawa సహ వ్యవస్థాపకుడు, జితేంద్ర శర్మ ఒక ఇంటర్వ్యూలో Okhi 90 E-Scooter గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. Okhi 90 ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ తో గరిష్టంగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే శక్తితో ఉంటుందని తెలిపారు. Okhi 90 భారతదేశంలోని E-Scooter మార్కెట్ ఎల్లలను మార్చబోతోందని కూడా అభిప్రాయపడ్డారు. ఈ స్కూటర్ లాంచ్ గురించి షేర్ చేసిన ట్వీట్ ను క్రింద చూడవచ్చు.

ఇక ఈ అప్ కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫీచర్ల గురించి చూస్తే, ఈ ఓకి 90 వేగంగా ఛార్జ్ చేసేందుకు వీలుగా ఫాస్ట్ ఛార్జింగ్ ఫంక్షనాలిటీని కలిగివుంటుంది. అంతేకాదు, ఈ ఇ-స్కూటర్ కనెక్టెడ్ వెహికల్ ఫీచర్స్ మరియు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) తో వస్తుంది. ఈ స్కూటర్ కేవలం 4 గంటల్లోనే 80% ఛార్జింగ్ అవుతుందని కూడా కంపెనీ పేర్కొంది.

ఎలక్ట్రిక్ వాహనాల పైన ఎక్కువ వేగంతో ప్రయాణించ లేకపోవడం ఒక డ్రా బ్యాక్. అయితే, ఈ ఒకినోవా తన Okhi 90 E-Scooter తో ఈ దూరాన్ని తుడిచే ప్రయత్నం చేస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక్క ఛార్జింగ్ తో 200 కి.మీ దూరం ప్రయాణం చేస్తుందంటే డబ్బుకు తగిన విలువను ఆశించవచ్చు. ఇవన్నీ కూడా ప్రస్తుతం కంపెనీ ప్రకటించిన టీజింగ్ ద్వారా మనం చూస్తున్న వివరాలు. విడుదల తరువాత ఈ స్కూటర్ ఎలా ఉంటుందో చూడాలి. 

గమనిక: పైన అందించిన ఇమేజ్ అవగాహన కోసం అందించిన కల్పిత చిత్రం

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo