5G ఫోను అందించాలని జియో యోచిస్తున్నట్లు తెలుస్తోంది
బడ్జెట్ ధరలో JioPhone 5G ని ప్రకటించవచ్చు
JioPhone 5G అందరికి అందుబాటు ధరలో వస్తుంది
ఇండియాలో 5G సర్వీస్ లతో పాటుగా 5G ఫోను కూడా అందించాలని జియో యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, జియోఫోన్ 5G చాలా రూమర్లు మరియు రిపోర్ట్స్ గత వారంగా మరింత ఊపందుకున్నాయి. వాస్తవానికి, గత సంవత్సరంలోనే రిలయన్స్ జియో తన 5G స్మార్ట్ ఫోన్ జియోఫోన్ 5G ని ప్రకటిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ, జియో మాత్రం గూగుల్ భాగస్వామ్యంతో Jio Phone Next 4G బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. అయితే, ఈసారి మాత్రం జియో 5G సర్వుసులు వచ్చే నాటికీ 5G ఫోన్ ను కూడా ప్రకటిస్తుందని జోష్యం చెబుతున్నారు.
జియో 5G సర్వీస్ ప్రకటించే సమయానికి బడ్జెట్ ధరలో JioPhone 5G ని కూడా ప్రకటించవచ్చు. అంతేకాదు, ఈ 5G ఫోన్ యొక్క స్పెక్స్ ను కూడా ఒక నివేదిక పేర్కొంది. ప్రస్తుత మార్కెట్లో 5G స్మార్ట్ ఫోన్స్ చాలానే లభిస్తున్నా కూడా అవన్నీ కూడా 15 వేల కంటే ఎక్కువ ధరలో ఉండగా, జియో మాత్రం JioPhone 5G అందరికి అందుబాటులో రూ.9,000 నుండి రూ.12,000 మధ్యలో ఉంచవచ్చు.
జియోఫోన్ 5G: లీక్డ్ స్పెక్స్
జియోఫోన్ 5జి స్పెక్స్ విషయానికి వస్తే, క్వాల్కమ్ బడ్జెట్ 5G చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 480 5G శక్తితో ఉంటుందని నివేదిక చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఇది N3, N5, N28, N40 మరియు N78 బ్యాండ్లకు మద్దతు ఇస్తుంది. అంటే, ఈ ఫోన్ భారతదేశం అంతటా 5G నెట్వర్క్లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ LCD డిస్ప్లే, 4GB మరియు 32GB స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ ఫోన్ పేద్ద 5,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉండవచ్చు. అంటే, గతంలో వచ్చిన Jio Phone Next తో పోలిస్తే పెద్ద మార్పులే ఈ ఫోన్ లో చూడవచ్చని మరియు కెమెరాల పరంగా పెద్ద మార్పులు లేకపోవచ్చని ఈ నివేదిక వెల్లడించింది.