ఈ నంబర్ నుండి మెసేజ్ వచ్చిందా..! అయితే, వెంటనే డిలీట్ చేయండి ..!

HIGHLIGHTS

ఆన్లైన్ లో ఈజీగా చేసే మోసాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి

ఇంటర్నెట్ మోసాల గురించి జాగ్రత్త వహించాలి

KYC వెరిఫికేషన్ అని చెప్పబడే ఒక స్పామ్ మెసేజ్ స్కామ్ తో జాగ్రత్త

ఈ నంబర్ నుండి మెసేజ్ వచ్చిందా..! అయితే, వెంటనే డిలీట్ చేయండి ..!

మరొకసారి మహమ్మారి పంజా విసరడంతో ఆన్లైన్ పనులను నామముకోవాల్సి వస్తుంది. ఇంకేముంది, ఇదే అదునుగా ఆన్‌లైన్ మోసాలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఆన్లైన్ లో ఈజీగా చేసే మోసాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి మరియు ఇవి ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇంటర్నెట్ మోసాల గురించి జాగ్రత్త వహించాలని ఇటీవల చాలా హెచ్చరించారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముఖ్యంగా, KYC వెరిఫికేషన్ అని చెప్పబడే ఒక స్పామ్ మెసేజ్ ద్వారా కొత్త స్కామ్ కు పాల్పడుతున్నట్లు సూచించారు. ఈ SMS స్కామ్ ఎలా ఉంటుందంటే, ఈ మెసేజ్ కు రెస్పాండ్ అవ్వకపోతే మీ నంబర్ 24 గంటల్లో బ్లాక్ అవుతుందని ఉంటుంది. Airtel, Vodafone, Idea మరియు Jio యూజర్లు కూడా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల ముసుగులో KYC వెరిఫికేషన్ కోసం అంటూ చెప్పబడే నకిలీ మెసేజెస్ అందుకుంటున్నారు. ఈ విషయం గురించి ట్విటర్ సాక్షిగా చాలామంది వినియోగదారులు గతంలో వెల్లడించారు.

ఎయిర్టెల్ నంబర్ కలిగిన కస్టమర్లు, వారి మొబైల్ నంబర్ కు 9114204378 నంబర్ నుండి 0 అనే మెసేజ్ అందుకుంటున్నారు. లోపలికి వెళితే అందులో, 'డియర్ ఎయిర్టెల్ కస్టమర్, ఈ రోజు మీ సిమ్ నిలిపివేయబడుతుంది. మీ SIM కార్డు ను అప్డేట్ చేసుకోండి' దీని కోసం మీరు వెంటనే 8582845285 కాల్ చేయండి, అని ఉంటుంది. అంతేకాదు, మీరు వెంటనే సంప్రదించగా పొతే మీ సిమ్ బ్లాక్ అవుతుందని కూడా చూపిస్తుంది. ఈ రకమైన మేసేజెస్  ద్వారా వినియోగదారుల దృష్టి మరల్చడం మరియు వారు రెస్పాండ్ ఇచ్చినప్పుడు వారిని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతుంది. ఈవిధంగా వారి నుండి వివరాలను రాబట్టి వారి బ్యాంకుల నుండి డబ్బును విత్ డ్రా చేయడం జరుగుతోంది.

ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చాల మంచిది. ఆన్లైన్ మాసాలకు ముఖ్యంగా కావాల్సింది 'OTP' కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వచ్చే OTP లను ఎట్టిపరిస్థితుల్లోను మరొకరితో షేర్ చెయ్యకండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo