రూ. 12,999 ధరలో స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్ చేసిన జీబ్రానిక్స్.!

రూ. 12,999 ధరలో స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్ చేసిన జీబ్రానిక్స్.!
HIGHLIGHTS

Zebronics ఇండియాలో కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ ను లాంచ్ చేసింది.

ZEBRONICS ZEB-PIXAPLAY 22 పేరుతో లాంచ్

1080p రిజల్యూషన్ తో పెద్ద స్క్రీన్ అందించ గలదని జీబ్రానిక్స్ తెలిపింది

ప్రముఖ ఆడియో బ్రాండ్ Zebronics ఇండియాలో కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ ను లాంచ్ చేసింది. ZEBRONICS ZEB-PIXAPLAY 22 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను కేవలం రూ. 12,999 ధరలో ప్రకటించింది. ఈ జీబ్రానిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్ చూడటానికి చిన్నగా ఉన్న 1080p రిజల్యూషన్ తో పెద్ద స్క్రీన్ అందించ గలదని జీబ్రానిక్స్ తెలిపింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ ధర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. 

ZEBRONICS ZEB-PIXAPLAY 22 : ధర 

ZEBRONICS ZEB-PIXAPLAY 22 ను జీబ్రానిక్స్ ఇండియాలో రూ. 12,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ పైన గొప్ప ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను కేవలం రూ. 1,186 అతి తక్కువ EMI అప్షన్ తో కూడా డెబిట్ కార్డ్ ద్వారా కూడా పొందే వీలుందని, అమెజాన్ తెలిపింది. 

ZEBRONICS ZEB-PIXAPLAY 22: స్పెక్స్ 

ఈ జీబ్రానిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్ బిల్ట్ ఇన్ స్పీకర్ మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ తో 406cm, అంటే దాదాపు 159 ఇంచ్ వరకూ బిగ్ స్క్రీన్ ను పొందవచ్చు. ఈ ప్రొజెక్టర్ డ్యూయల్ బ్యాంక్ Wi-Fi, Casting మరియు స్క్రీన్ మిర్రర్ లకు కూడా సపోర్ట్ చేస్తుంది. 

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ USB, HDMI, మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ Flipkart మరియు zebronics.com నుండి సేల్ లభిస్తోంది. అయితే, కంపెనీ అధికారిక సైట్ పైన మాత్రం ఈ స్మార్ట్ ప్రొజక్టర్ ధర రూ. 37,999 రూపాయలుగా చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo