Redmi Earphones: షియోమి అతి తక్కువ ధరకే విడుదల చేసింది

Updated on 02-Sep-2020
HIGHLIGHTS

షియోమి తన Redmi 9A స్మార్ట్ ఫోనుతో పాటుగా రెడ్‌మి ఇయర్‌ఫోన్స్ ని కూడా ఇండియాలో విడుదల చేసింది.

Redmi Earphones ని భారతదేశంలో కేవలం రూ .399 తక్కువ ధరతో లాంచ్ చేసింది. ఈ

అధికమైన BASS కోరుకునేవారికి ఈ Xiaomi Redmi Earphones సరిగ్గా సరిపోతాయి.

షియోమి తన Redmi 9A స్మార్ట్ ఫోనుతో పాటుగా రెడ్‌మి ఇయర్‌ఫోన్స్ ని కూడా ఇండియాలో విడుదల చేసింది. ఈ ఇయర్ ఫోన్స్ ని భారతదేశంలో కేవలం రూ .399 తక్కువ ధరతో లాంచ్ చేసింది. ఈ ఇయర్ ఫోన్స్ తక్కువ బరువుతో వున్నా కూడా  మంచి సౌండ్ అందిస్తుంది. అధికమైన BASS కోరుకునేవారికి ఈ ఇయర్ ఫోన్స్ సరిగ్గా సరిపోతాయి.   

షియోమి BASS ని పెంచే లక్ష్యంతో డైనమిక్ డ్రైవ్‌ లతో ఈ రెడ్‌మి ఇయర్ ‌ఫోన్ ‌లను ప్రకటించింది. ఈ రెడ్‌మి ఇయర్ ‌ఫోన్స్ ‌లో మైక్రోఫోన్ మరియు మినీ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఈ ఇయర్ ‌ఫోన్స్ ‌లో అల్యూమినియం మిశ్రమం నిర్మించబడింది మరియు 13 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. అలాగే, ఈ రెడ్మి ఇయర్ ఫోన్స్ ఎంచుకోవడానికి మూడు రంగులలో వస్తాయి – ఎరుపు, నలుపు మరియు నీలం.

ఇక ఈ రెడ్‌మి ఇయర్ ‌ఫోన్స్ ధర విషయానికి వస్తే, భారతదేశంలో దీనిని కేవలం 399 రూపాయల తక్కువ ధరకే ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుండి ఫ్లిప్ ‌కార్ట్, అమెజాన్ ఇండియా మరియు ఆఫ్‌ లైన్ రిటైల్ దుకాణాల్లో అమ్మకాలను ప్రారంభిస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :