HIGHLIGHTS
ఫ్రీ వైఫై కి కావలిసిన మౌలిక సదుపాయాలు ఇవ్వటం తో పాటుగా మరియు వైఫై యొక్క కరెంట్ సంభందిత ఖర్చులు కూడా జియో నే భరిస్తుందట
ఇప్పటివరకు జియో 6 నెలల పాటు ఫ్రీ ఆఫర్స్ అందించిందని అందరికీ తెలుసు . ఈ ఫ్రీ ఆఫర్స్ దేశం మొత్తం , యువకుల నుంచి ముసలివారి వరకు ఇంటర్నెట్ అంటే తెలియని వారు కూడా ఈరోజు ఇంటర్నెట్ వాడుతున్నారంటే అది జియో పుణ్యమే అని చెప్పాలి . కానీ ట్రాయ్ వేసిన ఆదేశం తో జియో ఫ్రీ ఆఫర్స్ కు గండి పడింది. అయినా కూడా జియో కు వున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం jio కు 108.68 మిలియన్ యూజర్లు వున్నారు. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి టోటల్ గా జియో ఫ్రీ వైఫై సర్వీసెస్ అందించనుంది. కాలేజీలలో ఫ్రీ గా వైఫై అందించే దిశగా కొత్త వ్యూహ రచనలు చేస్తుంది. దీనికోసం పంజాబ్ ప్రభుత్వం జియో తో ఒప్పందం కుదుర్చుకుంది. గవర్నమెంట్ iit , ఇంజినీరింగ్ కాలేజెస్ మరియు పోలీటెక్నీక్ కాలేజెస్ జియో ఫ్రీ వైఫై అందించనుందని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖా మంత్రి చరణ్ జీత్ సింగ్ తెలిపారు. ఫ్రీ వైఫై కి కావలిసిన మౌలిక సదుపాయాలు ఇవ్వటం తో పాటుగా మరియు వైఫై యొక్క కరెంట్ సంభందిత ఖర్చులు కూడా జియో నే భరిస్తుందట
SurveyTeam Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile