లాక్ డౌన్ ఎఫెక్ట్ : నిత్యావసర సరుకులు డెలివరీ చేయనున్న Zomato

లాక్ డౌన్ ఎఫెక్ట్ : నిత్యావసర సరుకులు డెలివరీ చేయనున్న Zomato

ఫుడ్ డెలివరీ సర్వీస్ దిగ్గజమైన జోమాటో తన ఆప్ నుండి భారతదేశంలోని 80 కి పైగా నగరాలకు నేరుగా కిరాణా మరియు ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని నిర్ణయించింది. కరోనావైరస్ యొక్క వ్యాప్తిని కారణంగా,  ఏప్రిల్ 14 వరకు అమలులో ఉన్న దేశవ్యాప్త లాక్ డౌన్ తో, అనేక వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ ఆరోగ్య సంక్షోభ సమయంలో, రెస్టారెంట్లు మరియు ఆహార పరిశ్రమలు ఎక్కువగా దెబ్బతిన్న వాటిలో ఒకటిగా చెప్పొచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది ఆహార పదార్థాల సంపర్క రహిత డెలివరీ మరియు రెస్టారెంట్లు మరియు రైడర్స్ రెండింటినీ నిర్వహించే పరిశుభ్రతపై తనిఖీ చేయడం వంటి అనేక చర్యలను తీసుకోవడం ద్వారా జోమాటో ఈ సమస్యను అధిగమించవలసి వచ్చింది. కొనసాగుతున్న COVID-19 సంక్షోభం నేపథ్యంలో కంపెనీ చేస్తున్నదంతా జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఒక బ్లాగ్ పోస్ట్‌ లో వెల్లడించారు.

భారతదేశం అంతటా 80+ నగరాల్లో కిరాణా డెలివరీని జోమాటో మార్కెట్ ద్వారా మోహరించింది. ఇక్కడ కంపెనీ తన విస్తారమైన డెలివరీ సమూహాన్ని ఉపయోగించుకుంటుంది. దీని కోసం, జోమాటో, ప్రభుత్వ అధికారులు, ఎఫ్‌ఎమ్‌జిసి కంపెనీలు, కిరాణా దుకాణాలు మరియు మరెన్నో భాగస్వామ్యంగా, కస్టమర్లకు అవసరమైన సామాగ్రి కోసం వారు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా సామాన్లను ఇళ్లకే చేరవేయనుంది.

అంతేకాకుండా, జోమాటో తన గోల్డ్ సబ్ స్క్రిప్షన్ వ్యవధిని అదనపు ఛార్జీలు లేకుండా రెండు నెలలు పొడిగిస్తోంది. రెస్టారెంట్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించడానికి అంకితమైన జోమాటో గోల్డ్ సపోర్ట్ ఫండ్ కూడా ఏర్పాటు చేయబడింది. ఏప్రిల్ 2020 కోసం తన గోల్డ్ టైర్ సబ్ స్క్రిప్షన్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం నేరుగా అవసరమైన రెస్టారెంట్ కార్మికులకు వెళ్తుందని కంపెనీ ప్రకటించింది.

సామాజిక-దూర నిబంధనలను అనుసరించి, కస్టమర్ మరియు జోమాటో రైడర్ ముట్టుకునే వీలులేకుండా నివారించడానికి ఫుడ్ డెలివరీ సేవ క్యాష్ ఆన్ డెలివరీ (సిఓడి) ఆర్డర్లను నిలిపివేసింది.

"జోమాటో నుండి, మా కస్టమర్లు, డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్ భాగస్వాములు మరియు ఈ సమయాల్లో ఎక్కువగా ప్రభావితమైన రోజువారీ వేతన కార్మికులు"  మా కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నాము – అని గోయల్ రాశారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile