CoronaVirus!! అసలు ఏంటి ఈ ప్లాస్మా థెరపీ? ఇది ఎలా పనిచేస్తుంది?

HIGHLIGHTS

కరోనావైరస్ గురించి ప్లాస్మా థెరపీ పేరు చాలా కాలంగా వినిపిస్తోంది.

CoronaVirus!! అసలు ఏంటి ఈ ప్లాస్మా థెరపీ? ఇది ఎలా పనిచేస్తుంది?

కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకువచ్చింది. కరోనావైరస్ కారణంగా సంభవించే ఈ అంటువ్యాధి, యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా, అగ్రరాజ్యమైన అమెరికాలో మరణ మృదంగం మోగించింది. అంతేకాదు, ఇటలీ మరియు సమీప దేశాలలో ఎక్కువ హాని చేస్తున్నట్లు కనిపించింది. అయితే, ప్రస్తుతం అమెరికా పేరు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

భారతదేశంలో కూడా, ఈ కరోనావైరస్ వ్యాధి జనాభాను ప్రభావితం చేసింది. మన దేశం మొత్తం ఈ కోవిడ్ -19 మహమ్మారితో బాధపడుతుందని కూడా చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు ఈ సంక్రమణను నివారించడానికి లేదా ఈ సంక్రమణ అని చెప్పడానికి యాంటీబాడీస్ తయారీకి తమ ప్రాణాలను కూడా అర్పించారు. ఈ నోవల్  కరోనా వైరస తో పోరాడడంలో శాస్త్రవేత్తలు సమర్థవంతమైన అనేక పద్ధతులను కనుగొన్నారని లేదా అన్వేషిస్తున్నారని చెప్పొచ్చు. ఈ చికిత్సలలో ఒకదాని గురించి మనం మాట్లాడితే, కరోనావైరస్ గురించి ప్లాస్మా థెరపీ పేరు చాలా కాలంగా వినిపిస్తోంది.

ఈ  ప్లాస్మా థెరపీ చికిత్సలో, కరోనావైరస్ యొక్క అంటువ్యాధి నుండి బయటపడిన ప్రజలు, వారు దానం చేసిన రక్తాన్ని తీసుకొని యాంటీబాడీని ఉత్పత్తి చేస్తారు. ఈ కరోనావైరస్ వ్యాధి బారిన పడిన వారిపై ఇది జరుగుతుంది. ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి, ఈ అంటువ్యాధి సంక్రమణను నివారించడంలో లేదా ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఎంత ప్రభావవంతంగా ఉందో, చికిత్స ఎలా పనిచేస్తుందో,అనే విషయాలను గురంచి ఈ రోజు మనం చూడబోతున్నాం. ఈ రోజు మీకు వీటన్నిటి గురించి సవివరమైన సమాచారం ఇవ్వబోతున్నాం.

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి?

కన్వలేసెంట్ ప్లాస్మా థెరపీ యొక్క లక్ష్యం, ఈ ఇన్ఫెక్షన్ నుండి తమ ప్రాణాలను రక్షించుకోగలిగిన వ్యక్తుల రక్తంలోని ప్రతిరోధకాలను(Antibodies) ఉపయోగించి ఇతర వ్యక్తుల ప్రాణాలను కాపాడడం . ఈ చికిత్స ద్వారా  కోవిడ్ -19 వ్యాధి కారణంగా అనారోగ్యం పాలైన వ్యక్తులు, రోగుల కుటుంబ సభ్యులు మరియు అధిక ప్రమాదం ఉన్న ఇతర ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచే అవకాశం వుంటుంది.

ఈ చికిత్స యొక్క భావన చాలా సులభం, ఇది వ్యాధి నుండి బయటపడిన వారి రక్తంలోని యాంటీబాడీ సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా దీన్ని చెయ్యొచ్చు. ఈ వ్యాధి కారణంగా అధిక ప్రమాదం ఉన్న ఇతర వ్యక్తులను రక్షించడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. ఈ వ్యాధి నుండి కోలుకుంటున్న ప్రజలను రక్తదానం చేయమని కోరడం, వారు  స్పందించి రక్తదానం చేయడాన్ని మనం భారతదేశంలో చూశాము. ఈ రకమైన సిద్ధాంతం గురించి, సరళంగా చెప్పాలంటే, కరోనావైరస్ సంక్రమణ  చెందిన వారు, 14 రోజుల తరువాత వారి  రోగనిరోధక శక్తి కారణంగా కరోనా పట్టు నుండి బయటకు వచ్చి, ఇంట్లో సురక్షితంగా ఉన్నారు. అటువంటి వారి రక్తంలోని ప్రతిరోధకాలు(Antibodies)  ఇతర బాధితులలోకి చొప్పించబడతాయి, తద్వారా ఇతర రోగిని కూడా ఆ యాంటీ బాడీస్ సామర్థ్యం ద్వారా  రక్షించవచ్చు.

ప్లాస్మా థెరపీ ఎలా పనిచేస్తుంది?

ప్లాస్మా థెరపీ కోవిడ్ -19 అంటువ్యాధితో బాధపడుతున్న సమయంలో వ్యాధి సోకి నయమైన వ్యక్తి నుండి అభివృద్ధి చేసిన ప్రతిరోధకాలను ఉపయోగిస్తుంది. ఈ ప్రతిరోధకాలు కరోనావైరస్ వ్యాధి కారణంగా రోగిలో లేదా ఈ సమయంలో  శరీరం దాని సహజ రోగనిరోధక ప్రతిస్పందన కారణంగా ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా, కరోనావైరస్ ప్రభావం, ఆ వ్యక్తి శరీరం నుండి తగ్గడం ప్రారంభమవుతుంది.

ఇప్పుడు, ఈ రోగి నయమైన వెంటనే, తన రక్తాన్ని దానం చేస్తారు.  తరువాత,  దానం చేసిన బ్లడ్ లోని యాంటీబాడీని మరొక రోగి యొక్క శరీరంలో ఉంచారు, తద్వారా అతను కూడా ఈ రోగనిరోధక శక్తిని సద్వినియోగం చేసుకొని స్వస్థత పొందగలడు. అయితే, ఈ రక్తానికి ముందు, హెపటైటిస్ బి, సి మరియు హెచ్ఐవి వంటి ఇతర వ్యాధులు పరీక్షలు  నిర్వహించబడతాయి. ఈ పరీక్షల తరువాత,  ఈ రక్తం సురక్షితంగా కనబడితే, ఈ రక్తం నుండి " ప్లాస్మా " తీసుకోబడుతుంది. ఇతర రోగులకు ఈ విధంగా చికిత్స చేస్తారు.

ప్లాస్మా థెరపీ రిస్క్?

ఈ ప్లాస్మా థెరపీ ద్వారా  ప్రాణాలను కాపాడవచ్చని చెబుతున్నా కొన్ని సమస్యలు మరియు కొన్ని ప్రమాదాలు కూడా దాగి ఉన్నాయి.   ఇక్కడ మీకు వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను.

ఈ చికిత్సలో, ఏ కారణం చేతనైనా ఒక రోగి యొక్క సమస్యను మరొక రోగికి పంపించే అవకాశం ఉంది. ఇది కాకుండా, కొంతమంది ఈ చికిత్స ద్వారా ప్రభావితం కాకపోవచ్చు మరియు ఇది వారి శరీరంలో సమస్యను కూడా పెంచుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. అయితే, దీనిపై ఎక్కువ శ్రద్ధ చూపకపోవడం కంటే  కరోనావైరస్ ను నివారించడానికి శక్తివంతమైన మార్గాలను కనుక్కోవడం మంచిది.

Source:

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile