జియో వినియోగదారులకు ఇంక రెండు రోజులు మాత్రమే మిగిలివుంది

జియో వినియోగదారులకు ఇంక రెండు రోజులు మాత్రమే మిగిలివుంది
HIGHLIGHTS

తాజా ఆఫర్లుగా జాబితా చేయనుంది

ఇప్పటికే, ప్రధాన టెలికం సంస్థలైనటువంటి భారతీ ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా తమ కొత్త టారిఫ్ ధరలను అమలుచేయగా, జియో మాత్రం డిసెంబర్ 6 వతేదికి తమ కొత్త టారిఫ్ ధరలను ప్రకటించనున్నట్లుగా తెలియచేసింది. అయితే, ఇప్పటికే ఒక కొత్త రూ.1744 రుపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం ప్రకటించింది. కానీ, ఇందులో పెద్ద చెప్పుకోదగిన మార్పులైతే ఏమీలేవు రూ.444 రుపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 4 రేట్లు మాత్రమే ఉంటుంది. అంటే, ఇది 336 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.                  

అయితే, ముందుగా జియో త్యమా కొత్త టారిఫ్ ల గురించి తెలిపిన విషయం ఏమిటంటే, రిలయన్స్ జియో పూర్తిగా కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ లేదా AIO ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది, ఇది 40% టారిఫ్ పెంపుతో వస్తుంది. డేటా, ఎస్ఎంఎస్, రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో అపరిమిత కాలింగ్ మరియు కొన్ని IUC నిమిషాల వంటి, అన్నిప్రయోజనాలతో కూడిన రిలయన్స్ జియో యొక్క ఆల్ ఇన్ వన్ ప్లాన్లను, తాజా ఆఫర్లుగా జాబితా చేయనుంది అని చెబుతోంది.

ఈ ప్లాన్లతో, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే, ఈ కొత్త ప్రకటన అంటే రిలయన్స్ జియో రూపొందించిన ఈ AIO ప్లాన్ల ధరలు మాత్రం 40% పెరుగుతాయి మరియు అందువల్ల వినియోగదారులు రాబోయే రోజుల్లో వాటి కోసం ఎక్కువ డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా చూస్తే, ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చెయ్యడానికి జియో వినియోగదారులకు ఇంకా సహతిలో రెండు రోజుల సమయం మాత్రమే వుంది.      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo