SBI కస్టమర్లకు భారీ సైబర్ అటాక్ ప్రమాదం, పూర్తి అకౌంట్ ఖాళీ కావచ్చు
దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన SBI తన మిలియన్ల మంది వినియోగదారులను హెచ్చరించింది.
అతి త్వరలో సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని బ్యాంక్ తన వినియోగదారులకు తెలిపింది.
కస్టమర్లు శ్రద్ధ చూపకపోతే, వినియోగదారుల బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బుమొత్తం ఖాళీ కావచ్చు.
దేశంలో కరోనావైరస్ మరియు లాక్ డౌన్ మధ్య, దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన SBI తన మిలియన్ల మంది వినియోగదారులను హెచ్చరించింది. అతి త్వరలో సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని బ్యాంక్ తన వినియోగదారులకు తెలిపింది. కస్టమర్లు శ్రద్ధ చూపకపోతే, వినియోగదారుల బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బుమొత్తం ఖాళీ కావచ్చు.
Survey
Attention! It has come to our notice that a cyber attack is going to take place in major cities of India. Kindly refrain yourself from clicking on emails coming from ncov2019@gov.in with a subject line Free COVID-19 Testing. pic.twitter.com/RbZolCjLMW
— State Bank of India (@TheOfficialSBI) June 21, 2020
భారతదేశంలో ఫిషింగ్ దాడి జరుగుతుందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సిఇఆర్టి-ఇన్) హెచ్చరించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వినియోగదారులకు తెలియజేసింది. ఈ హెచ్చరిక ఏమిచెబుతుందంటే, సైబర్ నేరస్థులు మీకు COIVD-19 యొక్క ఉచిత టెస్ట్ గురించి సమాచారం ఇస్తున్నట్లుగా, ఇమెయిల్ పంపడం ద్వారా మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నించవచ్చు. మీరు గనుక ఇటువంటి ఇమెయిల్స్ కి స్పందిస్తే, దీనిని దుర్వినియోగం చేయవచ్చు.
CBI కూడా హెచ్చరిక జారీ చేసింది
కరోనావైరస్ కారణంగా ఈ సమయంలో సైబర్ దాడులు జరుగుతాయని దేశ అత్యున్నత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిబిఐ) హెచ్చరించింది. కొంతకాలం క్రితం నుండే ఈ ప్రమాదం ఉందని సిపిఐ ప్రజలను హెచ్చరించింది. కరోనావైరస్ పేరిట జరిగిన అవినీతిపై సిబిఐ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేంద్ర సంస్థలను అప్రమత్తం చేసింది.
కరోనా సంబంధిత అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసిన దరఖాస్తుల గురించి సిబిఐ ప్రజలను అప్రమత్తం చేసింది. వినియోగదారులకు నకిలీ లింక్లను పంపడం ద్వారా, బ్యాంక్ మోసాలు మరియు క్రెడిట్ కార్డు వివరాలను హ్యాకర్లు దొంగిలించారు. కాబట్టి, తగిన జాగ్రత్తలు వహించడం మంచింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile