Samsung Glaxy F41: అతిపెద్ద బ్యాటరీ, sAMOLED స్క్రీన్ తో వస్తోంది

HIGHLIGHTS

సాంసంగ్ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో విడుదల చేయ్యుడానికి సిద్ధమవుతోంది.

Samsung Glaxy F41 స్మార్ట్‌ఫోన్ ని ఇండియాలో అక్టోబర్ 8 న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Glaxy F41 స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే Flipkart బ్యానర్ ద్వారా టీజ్ చేస్తోంది.

Samsung Glaxy F41: అతిపెద్ద బ్యాటరీ, sAMOLED స్క్రీన్ తో వస్తోంది

సాంసంగ్ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో విడుదల చేయ్యుడానికి సిద్ధమవుతోంది. Samsung Glaxy F41 స్మార్ట్‌ఫోన్ ని ఇండియాలో అక్టోబర్ 8 న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. Glaxy F41 స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే Flipkart బ్యానర్ ద్వారా టీజ్ చేస్తోంది. Flipkart ఇప్పటికే దీని కోసం ఒక ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది. ఈ Glaxy F41 స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద 6,000 బ్యాటరీ,sAMOLED స్క్రీన్ తో లాంచ్ చేయనున్నట్లు టీజ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

సాంసంగ్ ఇప్పటికే తన గెలాక్సీ సిరీస్ ద్వారా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. అలాగే, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన Samsung Glaxy F41 స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే వరుసలో నిలుస్తుందా అని అనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ప్రస్తుతం వినియోగదారులను ఆకర్షిస్తున్న అతిపెద్ద 6,000 బ్యాటరీ మరియు స్క్రీన్ పైన స్పష్టమైన వివరాలను మరియు ఖచ్చితమైన రంగులను చూపించే డిస్ప్లే గా పేరుపొందిన Super AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ తెస్తోంది. ఈ డిస్ప్లేలో ఇన్ఫినిటీ U డిజైన్ ఇస్తున్నట్లు కూడా ప్రకటించింది.   

అలాగే, ఈ గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ కెమేరాల విషయంలో కూడా కొన్ని వివరాలను అందించింది. గెలాక్సీ ఎఫ్41 వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ తో కనిపిస్తోంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 64MP ప్రధాన సెన్సార్ ని ఉన్నట్లు ధ్రువీకరించింది. అయితే, ఇతర రెండు సెన్సార్ వివరాలను మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. గెలాక్సీ ఎఫ్41 స్మార్ట్‌ఫోన్ ని లైవ్ లో చూడాలంటే అక్టోబర్ 8  వరకూ వేచి చూడాల్సిందే.                        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo