JIO కేవలం కాలింగ్ సౌలభ్యంతో పనిచేసే జియో ఫోన్ కోసం పనిచేస్తోంది : రిపోర్ట్

Updated on 30-Dec-2019
HIGHLIGHTS

ఇప్పుడు తీసుకురానున్న ఫీచర్ ఫోన్ను మాత్రం ప్రత్యేకంగా కాలింగ్‌ ను దృష్టిలో ఉంచుకుని తీసుకొస్తోంది.

రిలయన్స్ జియో, త్వరలో  తీసుకురాబోయే జియో ఫోన్ను ఇంటర్నెట్ మద్దతు లేకుండా ప్రారంభించవచ్చు. మేము ఆన్‌ లైన్లో వస్తున్న నివేదికను పరిశీలిస్తే, కంపెనీ కొత్త ఫీచర్ ఫోన్ కోసం పని చేస్తోందని, ఇది ప్రధానంగా కాల్ చేయడానికి అందించబడుతుందని తెలుస్తోంది. అయితే, ఈ వార్త నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.  ఎందుకంటే, మునుపటి ఫోన్లు అంటే జియోఫోన్ మరియు జియోఫోన్ 2 ప్రధానంగా ఇంటర్నెట్ కోసం ప్రారంభించబడ్డాయి. ఈ రెండు ఫోన్లను కంపెనీ కేవలం 4G  నెట్‌ వర్క్‌ లో లాంచ్ చేసింది. అయితే, ఇప్పుడు తీసుకురానున్న ఫీచర్ ఫోన్ను మాత్రం ప్రత్యేకంగా కాలింగ్‌ ను దృష్టిలో ఉంచుకుని తీసుకొస్తోంది.

రిలయన్స్ జియోఫోన్ లైట్: ఇప్పటివరకు బయటకి వచ్చిన విషయాలు

రిటైలర్లతో కంపెనీ ఒక సర్వే నిర్వహించిందని, దీనిలో వారు కాలింగ్ ఫీచర్ ఫోన్ గురించి ఎక్కువ ప్రస్తావించినట్లు సమాచారం. ఇంటర్నెట్‌ లో ఈ మొబైల్ ఫోన్‌ లో వస్తున్న వార్తలను చూసిన దీనిని జియోఫోన్ లైట్ అని పిలవవచ్చని చెబుతున్నారు. దేశంలో కొంతమంది వినియోగదారులు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నందున ఇది కూడా వస్తోంది. దేశంలో 500 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఉన్నారని రిలయన్స్ జియో ఇప్పటికే చెబుతోంది.

ఈ ఫీచర్ ఫోన్ ధర జియోఫోన్ లైట్ రూ .400 – రూ .500 ధరల మధ్య లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ, వాస్తవానికి దీని ధర 399 రూపాయలని, మరియు ఇది 50 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌తో రాబోతోందని తెలుస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :