REDMI NOTE 8 PRO మరికొద్ది సేపట్లో విడుదలకానుంది : LIVE చూడడం ఎలా
ఈ భారతీయ లాంచ్ గురించి ట్విట్టర్లో ప్రకటించింది
ముందుగా ఆగస్టులో, కంపెనీ రెడ్మి నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ను చైనాలో లాంచ్ చేసింది, ఇప్పుడు ఈ ఫోన్ భారతదేశంలో ప్రవేశించబోతోంది. చైనాలో ప్రారంభించిన తరువాత, టెస్ట్ మరియు ధృవీకరణ ప్రక్రియ కోసం రెండు నెలల సమయం తరువాత, ఈ రెడ్మి నోట్ 8 ప్రోను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ చెప్పారు. ఇటీవల, షావోమి ఈ ఫోన్కు సంబంధించి టీజర్ను విడుదల చేసింది. # 64MPQuadCamBeast తో ఒక పోస్ట్ పెట్టడం ద్వారా కంపెనీ లాంచ్ వివరాలను ప్రకటించింది. రెడ్మి ఇండియా ఈ భారతీయ లాంచ్ గురించి ట్విట్టర్లో ప్రకటించింది. ఈ ఫోన్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో రానుంది.
ఈ లాంచ్ ఈవెంట్ ఇక్కడ నుండి LIVE చూడవచ్చు.
రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు (చైనా వేరియంట్)
ఇది కాకుండా, రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్ గురించి చూస్తే, ఇది ఒక 6.53-అంగుళాల స్క్రీన్తో వస్తుంది. ఇది 3D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే తో వస్తుంది. మీరు దీన్ని కొత్త జాడే గ్రీన్ కలర్లో అందుకోనున్నారు. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకముగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్సెట్ తోఈ స్మార్ట్ ఫోన్నుఅందుకోనున్నారు .
రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్లో, గరిష్టంగా ఒక 64 MP కెమెరాను అందుకోనున్నారు, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది.