జియో దీపావళి అఫర్ నవంబర్ చివరి వరకూ పొడిగింపు
మీకు 693 రూపాయల లాభం అందుతుంది.
జియో గత నెలలో జియో ఫోన్ దీపావళి 2019 ను ప్రకటించింది, దీని కింద కస్టమర్ ఈ స్మార్ట్ ఫీచర్ ఫోన్నుకేవలం రూ .699 కు విక్రయిస్తున్నారు. దీపావళి ముగుస్తుండగానే ఈ అఫర్ ముగుస్తుండగా, జియో ఇప్పుడు ఈ ఆఫర్ ను 2019 నవంబర్ వరకు పొడిగించినట్లు పేర్కొంది. రూ .801 ధర తగ్గింపుతో పాటు, జియో తన వినియోగదారులకు రూ .693 డేటా ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
ఈ దీపావళికి ఒక అందమైన గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికోసం, జియో ప్రకటించిన దీపావళి అఫర్ కేవలం 808 రుపాయలతో ఒక ఫీచర్ ఫోనుతో పాటుగా ఒక నెలకు సరిపడా రీఛార్జిని కూడా గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. అంతేకాదు, ఇంకా చాల ఆఫర్లనే ప్రకటించింది. అధనంగా, ఈ ఫోన్ ని ఒక గిఫ్ట్ వోచర్ రూపంలో వారికీ పంపవచ్చు మరియు ఈ గిఫ్ట్ అందుకున్నవారు ఇండియాలోని ఏదైనా ఈ వోచరును ఉపయోగించి ఒక కొత్త jio ఫీచర్ ఫోన్ను పొందవచ్చు.
జియో ఆఫర్ వివరాలు
1. Rs. 808 గిఫ్ట్ ఆఫర్ : జియో ఫీచర్ ఫోన్ మరియు 1 నెల ఫోన్ రీఛార్జ్ తో పాటుగా వస్తుంది
2. Rs.1,006 గిఫ్ట్ ఆఫర్ : జియో ఫీచర్ ఫోన్ మరియు 3 నెలల ఫోన్ రీఛార్జ్ తో పాటుగా వస్తుంది
3. Rs.1,501 గిఫ్ట్ ఆఫర్ : జియో ఫీచర్ ఫోన్ మరియు 8 నెలల ఫోన్ రీఛార్జ్ తో పాటుగా వస్తుంది
4. Rs.1,996 గిఫ్ట్ ఆఫర్ : జియో ఫీచర్ ఫోన్ మరియు 13 నెలల ఫోన్ రీఛార్జ్ తో పాటుగా వస్తుంది
వాస్తవానికి,ఈ దీపావళి సందర్భంగా ఈ ఫీచర్ ఫోన్ను కేవలం రూ.699 రూపాయల ధరకే అమ్ముడుచేస్తోంది. అయితే, ఈ ఫోన్ కొనుగోలు చేసే వారు కొత్త కనెక్షన్ కోసం మరొక 100 రుబయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఈ ఫోన్ దీపావళి ఆఫరుతో కొనేవారికి ఒక నెల రీఛార్జిని కూడా అందిస్తోంది మరియు మొదటి 7 రీఛార్జ్ లకు గాను 99 రుపాయల్ విలువగల డేటా ప్రయోజనాన్ని కూడా అందుకోవచ్చు. అంటే 7 రీఛార్జ్ లకు 99 రూపాయల విలువగల డేటా అంటే 693 రూపాయల లాభం మీకు అందుతుంది.
అయితే, ఈ అఫర్ వద్దనుకుంటే, కేవలం రూ. 699 రుపాయల ధరలో కేవలం JioPhone ని మాత్రమే కూడా కొనుక్కోవచ్చు .