కూల్ ప్యాడ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల : కూల్ ప్యాడ్ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ‘మెగా 5ఏ స్మార్ట్ ఫోన్’ ని ఇండియాలో రూ . 6,999 ధరతో విడుదల చేసింది

Updated on 16-Aug-2018
HIGHLIGHTS

కూల్ ప్యాడ్ మెగా 5ఏ లో 18: 9 పూర్తి స్క్రీన్ హెచ్ డి+ డిస్ప్లే 1440 x 720 రిసల్యూషన్ మరియు ఎంట్రీ-లెవల్ స్పెక్స్.

భారత దేశంలో తన ఉనికిని విస్తరించడమే లక్ష్యంగా కూల్ ప్యాడ్ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మెగా 5ఏ ని ఇండియా – ప్రత్యేక డివైజ్ గా విడుదల చేసింది. ఈ ఫోన్లు కేవలం రూ . 6,999 ధరతో ఆఫ్ లైన్ స్టోర్లలో లభించనుంది. ఏఈ స్మార్ట్ ఫోన్ గోల్డ్ కలర్ మోడల్ తో ఎనిమిది రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది అవి:ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ఆగస్టు 16 నుంచి అందుబాటులో ఉంటుంది.

కూల్ ప్యాడ్ మెగా 5ఏ 18:9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 1440 x 720 రిజల్యూషన్ అందించగల ఒక 5.47 – అంగుళాల హెచ్ డి డిస్ప్లేకలిగివుంది. ఇంకా ఇది 1.3 క్లాక్ స్పీడ్  తో క్వాడ్ కోర్ స్ప్రెడ్ట్రం SC985K ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనిలో కెమేరాగా 8ఎంపీ +0.3ఎంపీ సెన్సర్లతో కూడిన డ్యూయల్ – కెమేరా సెటప్ ని అందించారు మరియు ముందు 5ఎంపీ షూటర్ ని ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ 2జీబీ ర్యామ్ మరియు 16జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తుంది. ఇంకా ఇందులో మెమొరీ పెంచుకునేందుకు వీలుంది SD కార్డు ద్వారా దీనిని 64జీబీ వరకు సామర్ధ్యం పెంచుకునేందుకు వీలుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఒరేమో 8.1 తో నడుస్తుంది మరియు ఇందులో ఫోన్ అన్లాక్ చేయడం కోసం పేస్ రికాగ్నిజేసన్ ఫీచర్ కూడా వుంది. ఈ డివైజ్ లో 2,500mAh శక్తిగల బ్యాటరీని కూడా అందించారు.

"కూల్ ప్యాడ్  అత్యుత్తమ తరగతి ఉత్పత్తులు అందజేయడానికి కట్టుబడి ఉంది, రిచ్ ప్రొడక్ట్ ని కలిగి ఉంటాయి. ప్రస్తుతమున్న 8.1 ఆండ్రాయిడ్  Oreo, ఒక గొప్ప స్క్రీన్ డిస్ప్లే  మరియు ఒక శక్తివంతమైన బ్యాటరీ జీవితంతో, కూల్ ప్యాడ్ మెగా 5ఏ  కఠినమైన మరొక పరిశ్రమ బెంచ్మార్క్ సెట్ చేస్తుంది. మేము మా ప్రాధమిక  ఏరియాల మీద ఆఫ్లైన్ ఛానెల్తో ఒక వేగమైన ఛానెల్ విస్తరణ వ్యూహాన్ని స్వీకరించాము.కాబట్టి  కూల్ ప్యాడ్ కి భారత్ కీలకమైన మార్కెట్ గా ఉంది. విస్తృతమైన ప్రేక్షకులకు  అందించే విధంగా ఉత్పత్తుల శ్రేణిని మేము ప్రారంభించము '' అని కూల్ ప్యాడ్  ఇండియా సీఈఓ సయ్యద్ తాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.

కూల్ ప్యాడ్ ఒక MOU సంతకం చేసింది చైనా మొబైల్తో, ఇది వారి ప్రముఖ 5జి  టెక్నాలజీ భాగస్వామి. జూన్ 28 న షాంఘైలో వరల్డ్ మొబైల్ కాన్ఫరెన్స్ గ్లోబల్ టెర్మినల్ సమ్మిట్ సందర్భంగా MOU సంతకం చేయబడినది. మే లో, ఇది డ్యూయల్ – సెల్ఫీ కెమెరాలతో కూల్ ప్యాడ్ నోట్ 6 స్మార్ట్ ఫోన్ ని ప్రారంభించింది.

ఈ ఏడాది జనవరిలో, షెన్జ్ హేన్ -కి చెందిన ఫోన్-మేకర్ బిడ్ ఎడియు తన ఆర్ధికంగా-సమస్యాత్మక చైనీస్ భాగస్వామి లీఈకోతో కలిసి, 300 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పవర్ సన్ వెంచర్స్ నుండి కుటుంబ ట్రస్ట్కు పెట్టుబడిగా ప్రకటించింది. "మేము స్వీకరించిన తాజా నిధులు ప్రధానంగా భారతీయ మరియు అమెరికా మార్కెట్లు. మార్కెట్లో చాలా అవకాశాలున్నాయని ఎందుకంటే మేము చైనాలో చాలా పని చేయలేము. అయితే భారత్ లోను, అమెరికా మార్కెట్లోనూ మేము తీవ్రంగా విస్తరించనున్నామని " అని తాజుద్దీన్ సందర్భంగా చెప్పారు. కృత్రిమ మేధస్సు (AI) లో తమ సామర్ధ్యాలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :