Xiaomi మి మిక్స్ 2S, గేమింగ్ లాప్టాప్ లు చైనాలో లాంచ్ చేయబడ్డాయి…

Xiaomi మి మిక్స్ 2S, గేమింగ్ లాప్టాప్ లు  చైనాలో లాంచ్ చేయబడ్డాయి…

చైనీస్ స్మార్ట్ఫోన్ నిర్మాత  Xiaomi  మంగళవారం మీ మిక్స్ 2ఎస్  చైనాలో  లాంచ్ చేసింది . ఈ డివైస్  కృత్రిమ మేధస్సు (AI) మరియు డ్యూయల్ కెమెరా అమర్చారు మరియు అది ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 చిప్సెట్ కలిగి ఉంది. ఒక గేమింగ్ ల్యాప్టాప్ కూడా ప్రారంభించబడింది. మీ  మిక్స్ 2 S ధర  3,299 యువాన్ (దాదాపు 34,055 రూపాయలు ) మరియు చైనీస్ మార్కెట్ లో  ఏప్రిల్ 3 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది .

మీ  మిక్స్ 2S యొక్క డ్యూయల్  కెమెరా సెటప్ లో  సోనీ యొక్క ఫ్లాగ్షిప్  IMX 363 సెన్సార్ ని  ఉపయోగించారు   మరియు ఆటో ఫోకస్ కోసం 'డ్యూయల్ -పిక్సెల్' టెక్నాలజీ ని ఇచ్చారు .

ఈ స్మార్ట్ఫోన్ 6 GB మరియు 64 GB స్టోరేజ్  వెర్షన్, 6 GB మరియు 128 GB మెమరీ వెర్షన్, మరియు 8 GB మరియు 256 GB మెమరీ వెర్షన్,ధరలు 3,299 యువాన్, 3,599 యువాన్ మరియు 3,999 యువాన్, వరుసగా అందుబాటులో ఉంటుంది. 

కంపెనీ , ఇంటెల్ యొక్క 7 వ తరం కోర్ ప్రాసెసర్లను కలిగి ఉన్న మొట్టమొదటి అధిక-ప్రదర్శన గేమింగ్ లాప్టాప్ ని  విడుదల చేసింది. ఇది ఎన్విడియా జీఫోర్స్ 'GTX 1060' గ్రాఫిక్ కార్డు, 16GB డ్యూయల్  ఛానల్ DDR4 RAM మరియు 256 GB SSD ప్లస్ 1 TB హార్డు డ్రైవును కలిగి ఉంటుంది.

ఈ డివైస్  ఏప్రిల్ 13 నుండి చైనాలో సేల్ కి అందుబాటులో ఉంటుంది మరియు దీని  ప్రారంభ ధర 5,999 యువాన్. కోర్ i7 మరియు GTS 1060 PL 16 GB వెర్షన్ 8,999 యువాన్ ధర వద్ద అందుబాటులో ఉంటాయి . 

దీనితో పాటు, కంపెనీ  MI స్పీకర్ యొక్క చిన్న వెర్షన్ ని  కూడా ప్రారంభించింది, ఇది 169 యువాన్ ధర వద్ద ఉంది.

 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo