కరోనా ఎఫెక్ట్ : భారతదేశంలో Online ఎడ్యుకేషన్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

కరోనా ఎఫెక్ట్ : భారతదేశంలో Online ఎడ్యుకేషన్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీనితో  1.5 బిలియన్లకు పైగా పిల్లలు ఇంట్లో కూర్చోవాల్సివచ్చింది. ఇది చాలా పెద్ద అసౌకర్యంగా పిలువబడుతుంది. అయితే,  భారతదేశంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

విద్యాసంస్థలు ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభిస్తున్నాయి మరియు కొన్ని విద్యా సాంకేతిక పరిజ్ఞాన స్టార్టప్స్ తాత్కాలికంగా ఉచిత తరగతులను అందిస్తున్నాయి.భారతదేశంలో పెద్ద విద్య స్టార్టప్ అయిన Byju గురించి మాట్లాడితే, మార్చి ప్రారంభంలో, ఇది పిల్లలకు వారి అభ్యాసాల కోసం ఈ అప్లికేషన్ ఉచిత యాక్సెస్ ఇస్తుందని ప్రకటించింది, గత సంవత్సరం చివరిలో ఇది 40 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. అంతే కాదు, ప్రీమియం షబ్ స్క్రిప్షన్ కోసం సుమారు 3 మిలియన్ల మంది ఉన్నారని కూడా తెలుస్తోంది. అంటే, వారు బైజు చందా కోసం సంవత్సరానికి $ 150 నుండి $ 200 వరకు చెల్లిస్తారు.

ప్రకటన నుండి, ఇంటరాక్టివ్ వీడియో పాఠాలు మరియు లైవ్ క్లాసుల నుండి క్విజ్‌లు మరియు పరీక్షల తయారీ వరకు 60% విద్యార్థులు తమ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మార్చి చివరిలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించిన దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన తరువాత, ఈ వైపు భారీ పెరుగుదల కనిపించింది. అయితే ఈ లాక్డౌన్ వ్యవధిని మరింత పొడిగించినట్లు మనందరికీ తెలుసు, ఇది  మే 3 వరకూ కొనసాగుతుంది.  ఈ పరిస్థితుల్లో,  ఆన్‌లైన్ విద్య ఎక్కడికి దారితీస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ దిశలో భారీ పెరుగుదల చూడబోతున్నారా? అయితే, ఈ జాబితాలో బైజులు మాత్రమే ఉండవు.ఈ జాబితాలో పిల్లలకు ఆన్‌లైన్ కంటెంట్‌ను అందించే Unacademy , Vedantu మరియు Toppr మొదలైనవి ఉన్నాయి.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ లో ఏమి జరగబోతోంది?

గూగుల్ మరియు KPMG 2017 నివేదికలో భారతదేశ ఆన్‌లైన్ విద్యా మార్కెట్ 2021 లో 2 బిలియన్ డాలర్లు, 2016 లో 250 మిలియన్ డాలర్లు, 9.6 మిలియన్ ఫీజు చెల్లించే వినియోగదారులకు ఉంటుందని అంచనా వేసింది.

ఆ సంఖ్యలకు గణనీయమైన మార్పు అవసరం కావచ్చు. ప్రస్తుత పాఠశాల మూసివేతలు ఆన్‌లైన్ విద్యను పెంచడమే కాక, పరీక్షల తయారీకి తక్కువ ప్రాధాన్యతనిస్తూ భారతదేశ విద్యా వ్యవస్థను తిరిగి స్థాపించడంలో సహాయపడతాయని బైజు అభిప్రాయపడ్డారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile