రియల్మీ సంస్థ 2020 లో తన స్మార్ట్ టీవీలను తెచ్చేందుకు సిద్ధమవుతోందా?
షావోమి తో పోటీ పడనున్నట్లు చెబుతున్నారు.
ఇటీవల, రియల్మి తన ప్రొడక్షన్ పోర్ట్ఫోలియోను భారతదేశం మరియు చైనాలో ఎక్కువగా విస్తరిస్తోంది. సంస్థ ఇప్పటికే మొబైల్ ఫోన్లు, ఉపకరణాలు, పవర్ బ్యాంకులు మరియు ఇయర్ ఫోన్లను విక్రయిస్తుంది. అయితే, ఇప్పుడు రియల్మి తన స్మార్ట్ టీవీలతో, టీవీ మార్కెట్లోకి కూడా ప్రవేశించడానికి వివిధ అవకాశాలను అన్వేషిస్తుందని పుకారు వస్తోంది. భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్ టీవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే mi టీవీలను విక్రయించే స్వదేశీ ప్రత్యర్థి షావోమి తో పోటీ పడనున్నట్లు చెబుతున్నారు. రియల్మి ఈ ఏడాది చివర్లో తన ఐయోటి పరికరాల ప్రయోగాన్ని గురించి కూడా టీజ్ చేసింది మరియు ఈ విషయాలను బట్టి చూస్తుంటే, స్మార్ట్ టివిలను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.
రియల్మి ఎక్స్ 50 5 జి లాంచ్ లో కంపెనీ తన టీవీ కేటగిరీని 2020 లో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించిన సిఎమ్ఓ జు క్వి చేజ్ నుంచి ఈ తాజా అప్డేట్ వచ్చింది. అయితే, రియల్మి 2019 చివరి నాటికి తన మొట్టమొదటి స్మార్ట్ టివిని లాంచ్ చేస్తుందని పుకార్లు వచ్చాయి, కాని అది జరగలేదు. రియల్మీ టీవీలు షావోమి యొక్క మి టీవీ శ్రేణికి సమానమైన ఫీచర్లతో అందిస్తాయని భావిస్తున్నారు.
వేర్వేరు స్పెసిఫికేషన్లతో వివిధ టీవీలను ప్రారంభించటానికి రియల్మి ఆలోచిస్తున్నట్లు చెప్పబడినది. ఎక్కువ యాప్ మద్దతుతో పాటు పూర్తి స్థాయి స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించడానికి ఇది ఆండ్రాయిడ్ టీవీని అమలు చేసే అవకాశం ఉంది. సూచన కోసం, షావోమి ఇటీవల చైనాలో మి టివి 5 సిరీస్ ను విడుదల చేసింది, ఇది QLED ప్యానెల్, తాజా హార్డ్ వేర్ మరియు సరసమైన ధర వంటి లక్షణాలను అందిస్తుంది. అలాగే, మి 5 ప్రోలో 8K వీడియో సపోర్ట్ తో వచ్చే క్వాంటం డాట్ డిస్ప్లే ఉంది.
రియల్మి సీఈఓ మాధవ్ శేత్ కూడా కనెక్ట్ చేయబడిన పరికరాల శ్రేణిని తీసుకురావాలని టీజ్ చేశారు. ఫిట్ నెస్ బ్యాండ్ ను ప్రారంభించనున్నట్లు కూడా పుకార్లు ఉన్నాయి. ఇటీవలే, రియల్మి బడ్స్ ఎయిర్ ను ప్రారంభించడంతో వైర్లెస్ ఇయర్ ఫోన్స్ విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ తన మొదటి 5 జి స్మార్ట్ ఫోన్ రియల్మి ఎక్స్ 50 5 జిని ఈ వారంలో విడుదల చేసింది.