Earthquake: దేశంలో పలు ప్రాంతాల్లో వచ్చిన భూకంపం .. ఆన్ లైన్ లో లైవ్ ఎర్త్క్వేక్ ఎలా చెక్ చేయాలో తెలుసా.!
నిన్న సాయంత్రం మరియు ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది
నిన్న కలకత్తా, హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది
ఈరోజు అస్సాం, గౌహతి మరియు మన పక్క దేశమైన భూటాన్ లో కూడా భూమి కంపించింది
నిన్న సాయంత్రం మరియు ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. నిన్న కలకత్తా, హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. ఈరోజు అస్సాం, గౌహతి మరియు మన పక్క దేశమైన భూటాన్ లో కూడా భూమి కంపించింది. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ సంగతి తెలిసిందే. గోరంత జరిగితే కొండంత చెప్పడం సాధారణ విషయంగా మారింది. అందుకే, ఎర్త్క్వేక్ లైవ్ అప్డేట్ ను మీరే స్వయంగా ఎలా చెక్ చేయాలో ఈ రోజు తెలుసుకోండి.
SurveyEarthquake: లైవ్ లో ఎలా చెక్ చేయాలి?
ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా భూకంపం సంభవించిన కొన్ని నిమిషాల్లోనే దాని వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు లేదా మెసేజ్లను నమ్మే ముందు అధికారిక సైట్ అండ్ సర్వీస్ ల ద్వారా భూకంపాన్ని ధృవీకరించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం అనేక వెబ్ సైట్లు మరియు మొబైల్ యాప్ లు రియల్ టైమ్లో భూకంప సమాచారాన్ని అందిస్తున్నాయి.

భూకంప వివరాలు తెలుసుకోవడానికి ముందుగా Google లో “Earthquake Near Me” లేదా “Latest Earthquakes” అని సెర్చ్ చేయండి. గూగుల్ సాధారణంగా లేటెస్ట్ భూకంపాల వివరాలను మ్యాప్ లో చూపిస్తుంది. అలాగే అమెరికాకు చెందిన USGS (యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే) వెబ్ సైట్ ప్రపంచవ్యాప్తంగా సంభవించే భూకంపాల డేటాను ప్రత్యక్షంగా అందిస్తుంది. భూకంప తీవ్రత (మాగ్నిట్యూడ్), కేంద్ర బిందువు (ఎపిసెంటర్), లోతు (డెప్త్), సమయం వంటి వివరాలను ఇక్కడ చూడవచ్చు.
అదే విధంగా EMSC (యురేపియన్ మెడిటేరియన్ సీస్మాలాజికల్ సెంటర్ మరియు భారతదేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెబ్ సైట్లు కూడా తాజా భూకంప సమాచారాన్ని అందిస్తాయి. ఈ ప్లాట్ ఫారమ్ లలో లైవ్ మ్యాప్ ద్వారా ఏ ప్రాంతంలో భూకంపం సంభవించిందో సులభంగా తెలుసుకోవచ్చు.
Also Read: అమెజాన్ మెగా డీల్ డేస్ సేల్ నుంచి కేవలం 23 వేలకే Xiaomi బిగ్ Dolby Smart Tv అందుకోండి.!
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు భూకంప నెట్ వర్క్, మై ఎర్త్క్వేక్ అలర్ట్స్ అండ్ ఫీడ్ వంటి యాప్ లను ఉపయోగించి రియల్ టైమ్ నోటిఫికేషన్లు పొందవచ్చు. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టం కూడా అందుబాటులో ఉంది. ఇది సమీప ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు హెచ్చరికలు పంపుతుంది.
అయితే, భూకంపానికి సంబంధించిన సమాచారం కోసం సోషల్ మీడియా పోస్టులపై మాత్రమే ఆధారపడకండి. ఎందుకంటే, ఇది నిజమైన సోర్స్ నుంచి వచ్చిన డేటా కాకపోవచ్చు. అందుకే, ఎల్లప్పుడూ అధికారిక భూకంప పరిశోధనా సంస్థలు లేదా విశ్వసనీయ వెబ్ సైట్ల ద్వారా సమాచారాన్ని ధృవీకరించడం మంచిది. ఇలా చేయడం వల్ల తప్పుడు వార్తలను నివారించడంతో పాటు నిజమైన పరిస్థితిని వెంటనే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
