హువావై , Airtel భారత్ లో 5G టెస్ట్ విజయవంతం ….

హువావై , Airtel భారత్ లో 5G టెస్ట్ విజయవంతం ….

శుక్రవారం చైనా టెక్నాలజీ దిగ్గజం హువాయ్, టెలికాం సర్వీసు ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్ విజయవంతంగా భారతదేశంలో 5 జి నెట్వర్క్ ను పరీక్షించింది. ఎయిర్టెల్ మనేసర్ (గురుగ్రామ్ ) వద్ద ఉన్న నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ పరీక్ష జరిగింది అని ఒక ప్రకటనలో తెలిపింది.

భారతీయ ఎయిర్టెల్ డైరెక్టర్ (నెట్వర్క్స్) అభయ్  సావర్గోంకర్ మాట్లాడుతూ, '5 జి ఇంటరాప్రిబిలిటీ అండ్ డెవలప్మెంట్ టెస్ట్ (ఐఓడిటి), పార్టనర్షిప్స్ పై  మేము వేగంగా అభివృద్ధి చెందుతున్నాము.మేము భారత్ లో  బలమైన 5 జి జీవావరణవ్యవస్థను అభివృద్ధి చేయడానికి మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. అని తెలిపారు .

ఈ పరీక్ష సమయంలో, 3 Gbps కన్నా ఎక్కువ స్పీడ్  నమోదు చేయబడిందని కంపెనీ తెలిపింది. ఇది 3.5 GHz బ్యాండ్ పై  100 MHz బ్యాండ్విడ్త్ తో  సాధించిన గరిష్ట స్పీడ్ , దీని ఎండ్-టు-ఎండ్ నెట్వర్క్ జాప్యం ఒక మిల్లీసెకనుకు దగ్గరగా ఉంటుంది.

 

 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo