boAt 5.1 Dolby Atmos soundbar today available at never before price
boAt 5.1 Dolby Atmos సౌండ్ ఈరోజు నెవర్ బిఫోర్ ప్రైస్ లో లభిస్తుంది. 15 వేల రూపాయల ఉప ధరలో విడుదలైన బోట్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈరోజు అత్యంత చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 500 వాట్ జబర్దస్త్ గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది మరియు యూజర్ల నుంచి మంచి రేటింగ్ కూడా అందుకుంది. అయితే, ఈ రోజు ఈ సౌండ్ బార్ మీకు కేవలం 10 వేల రూపాయలు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.
బోట్ యొక్క 5.1 ఛానల్ సౌండ్ బార్ Aavante Prime 5.1 5000 DA ఈరోజు ఇంత చవక ధరలో లభిస్తుంది. విషయం ఏమిటంటే, ఇండియన్ మార్కెట్లో 15 వేల రూపాయల ఒక బడ్జెట్లో విడుదలైన ఈ బోట్ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 10,999 రూపాయల ధరలో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై నో కాస్ట్ EMI ఆఫర్ ను కూడా అందించింది.
బోట్ యొక్క ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు మాస్టర్ రిమోట్ కంట్రోల్ తో జతగా వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.
ఈ 5.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు డాల్బీ సౌండ్ సపోర్ట్ తో గొప్ప ఫీల్ అందించే సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో, మూవీస్, న్యూస్ మరియు మ్యూజిక్ మూడు ఈక్వలైజర్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇక కనెక్టివిటీ సపోర్ట్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Oppo F33 5G మరియు F33 Pro 5G రెండు కొత్త ఫోన్లు లాంచ్: ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.