Whatsapp తన గ్రూప్ కాల్ పరిమితిని పెంచింది : ఒకేసారి ఎక్కువ మందికి గ్రూప్ కాల్ అవకాశం.

HIGHLIGHTS

ఈ ప్రకటన ఈ సమయంలో చాలా అనువైనదిగా ఉంటుంది.

Whatsapp తన గ్రూప్ కాల్ పరిమితిని పెంచింది : ఒకేసారి ఎక్కువ మందికి గ్రూప్ కాల్ అవకాశం.

ఇప్పటి వరకూ ఉన్న గ్రూప్ కాల్ పరిమితిని నలుగురి నుండి ఎనిమిది మందికి పెంచుతున్నట్లు ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ Whatsapp ప్రకటించింది. ఫేస్ బుక్ యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఫేస్ బుక్  ప్రకటించిన కొన్ని అప్డేట్లలో భాగం. కాలపరిమితి లేని 50 మంది వరకు మెసెంజర్ రూములు ఉంటాయని ప్రకటించడం కూడా ఇందులో ఉంది. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా డ్రాప్ చేయగలరు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 

 

COVID-19 కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నందున, ఈ ప్రకటన ఈ సమయంలో చాలా అనువైనదిగా ఉంటుంది. ఈ చర్య వలన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి మరియు ఎక్కువ మంది ఒకేసారి గ్రూప్ కాల్ ద్వారా సన్నిహితంగా ఉండటానికి సహకరిస్తుంది.

కొనసాగుతున్న లాక్డౌన్ సమయంలో, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల కోసం డిమాండ్ ఎప్పటికప్పుడు ఎక్కువగా ఉంటుంది. ప్రారంభంలో, చాలా వ్యాపార మరియు విద్యాసంస్థలు వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం Zoom App వైపు తిరిగాయి. ఏదేమైనా, ఈ ఆప్, డేటాను లీక్ చేస్తున్నట్లు నివేదికలు సూచించిన తర్వాత ఈ ఆప్ యొక్క ప్రైవసీ అంశం ప్రశ్నార్థకం మారింది. అయితే, అప్పటి నుండి కంపెనీ జరిగినదానికి చాలాసార్లు క్షమాపణలు చెప్పింది మరియు అప్పటి నుండి ఈ ఆప్ యొక్క సమస్యలు పరిష్కరించ బడ్డాయని పేర్కొంది. అయితే, 50,000 మందికి పైగా వినియోగదారుల జూమ్ ఆధారాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు తరువాత తెలిసింది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile