గూగుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తో తన డిజిటల్ చెల్లింపు యాప్ "తేజ్ " ను జోడిస్తుందని మంగళవారం ప్రకటించింది. ఇప్పుడు వినియోగదారులు @Oksbi UPI ID లను సృష్టించగలుగుతారు మరియు ఎస్బిఐ వినియోగదారుల ప్రత్యేకమైన ఆఫర్లను పొందగలరు.
Surveyగత ఏడాది సెప్టెంబరులో ప్రారంభించబడిన "Tez" యాప్ 250 మిలియన్ల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ లను కలిగి ఉంది మరియు దేశవ్యాప్తంగా 13.5 మిలియన్లకు పైగా నెలవారీ సక్రియ వినియోగదారులను కలిగి ఉంది.
ఎస్బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, "గూగుల్ తేజ్ తో ఈ భాగస్వామ్యం 40 మిలియన్ల మంది కొత్త వినియోగదారులకు కొత్త అవకాశాలను అందిస్తుందని" అన్నారు.