Redmi Pad 2 Pro 5G: భారీ 12,000 mAh బ్యాటరీ అండ్ డాల్బీ విజన్ స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

కొత్త సంవత్సరం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ కోసం షియోమి రెడీ అయ్యింది

రెడ్ మీ నోట్ 15 ఫోన్ తో పాటు రెడ్ మీ పాడ్ 2 ప్రో కూడా లాంచ్ చేస్తోంది

ఈ అప్ కమింగ్ పాడ్ ను భారీ 12,000 mAh బ్యాటరీ తో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ ప్రకటించింది

Redmi Pad 2 Pro 5G : కొత్త సంవత్సరం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ కోసం షియోమి రెడీ అయ్యింది. రెడ్ మీ నోట్ 15 ఫోన్ తో పాటు రెడ్ మీ పాడ్ 2 ప్రో కూడా లాంచ్ చేస్తోంది. ఈ రెండు డివైజెస్ కీలక ఫీచర్లు మరియు లాంచ్ డేట్ కూడా షియోమీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ పాడ్ ను భారీ 12,000 mAh బ్యాటరీ అండ్ డాల్బీ విజన్ స్క్రీన్ తో లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ ప్రకటించింది.

Redmi Pad 2 Pro 5G : లాంచ్ డేట్?

రెడ్ మి పాడ్ 2 ప్రో టాబ్లెట్ ను 2026 జనవరి 6న ఇండియాలో పరిచయం చేస్తుంది. ఈ పాడ్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ నుండి ఈ టాబ్లెట్ ఫీచర్స్ కూడా రివీల్ చేసింది.

Redmi Pad 2 Pro 5G: ఫీచర్స్

రెడ్ మీ పాడ్ 2 ప్రో చాలా స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కొత్త పాడ్ 12.1 ఇంచ్ నిగ డిస్ప్లే తో వస్తుంది మరియు ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ రెడ్ మీ పాడ్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప విజువల్స్ అందించే డాల్బీ విజన్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పాడ్ ని లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు టీజర్ నుంచి అనౌన్స్ చేసింది. అయితే, ఈ చిప్ సెట్ వివరాలు ఇంకా రిలీజ్ చేయలేదు.

రెడ్ మీ పాడ్ 2 ప్రో పటిష్టమైన మెటల్ యూనీ బాడీ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ పాడ్ అతి సన్నని డిజైన్ కలిగి ఉన్నా కూడా 1200 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుంది. ఈ బ్యాటరీతో ఎక్కువ సమయం ఈ పాడ్ నిలిచి ఉంటుందని రెడ్ మీ తెలిపింది. ఇంత పెద్ద బ్యాటరీ కలిగిన ఈ పాడ్ వేగంగా ఛార్జ్ చేసే వేగవంతమైన ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Also Read: Oppo Reno 15 Pro Mini: చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్న ఒప్పో.!

ఈ అప్ కమింగ్ పాడ్ లో క్వాడ్ స్పీకర్ సెటప్ ఉంటుంది. క్వాడ్ స్పీకర్ సెటప్ తో పాటు మంచి సౌండ్ అందించే డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ పాడ్ ఒక్కొక్క ఫీచర్స్ ని విడుదల చేస్తుంది కాబట్టి, ఈ పాడ్ లాంచ్ చేయడానికి ముందే మిగిలిన కీలక ఫీచర్స్ కూడా విడుదల చేస్తుంది. ఈ పాడ్ ముందు వచ్చిన పాడ్ కంటే మరింత శక్తివంతమైన ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :