రేపు లాంచ్ కానున్న కొత్త తరం NOKIA స్మార్ట్ ఫోన్లు
నోకియా 8.2,నోకియా 5.2 మరియు నోకియా 2.3 ఫోన్నుకూడా లాంచ్ చేయవచ్చని అంచావేస్తున్నారు.
HMD గ్లోబల్, రేపు మార్కెట్లోకి చాలా తక్కువ ధరలో 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజితో నోకియా 2.3 స్మార్ట్ ఫోనన్నుతీసుకురానునట్లు తెలుస్తోంది. ఇక్కడ అందించిన లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 93.99 యూరోలు (సుమారు రూ.7500) ధరతో తీసుకురావచ్చని అర్ధమవుతోంది. అలాగే, నోకియా 2.3 యొక్క మరొక వేరియంట్ ను 93.99 యూరోల ధరతో తీసుకురావచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ ఒక 6.1 అంగుళాల HD+ డిస్ప్లే తో మరియు 3,920 mAh బ్యాటరీతో ప్యాకేజి చెయ్యవచ్చు.
ముందుగా వచ్చిన లీక్ సమాచారం ప్రకారం, నోకియా 7.2 లో ఇచ్చిన బ్లూటూత్ 5.0 వంటి ఎలిమెంట్ ఇంధులో ఇవ్వవచ్చని తెలిసింది మరియు చార్కోల్ బ్లాక్, సియాన్ గ్రీన్ మరియు సాండ్ వాటి మూడు వైవిధమైన రంగులలో కూడా రావచ్చని తెలుస్తోంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో బడ్జెట్ ధరలో వేగవంతముగా పనిచేయగల మీడియా టెక్ హీలియో A22 SoC ని ఇందులో ఇవ్వవచ్చని కూడా చెబుతున్నారు. అలాగే, ఈ ఫాంను ఒక పాళీ కార్బోనేట్ మెటీరియల్ మరియు ఒక ప్రత్యేకమైన Google Assistant బటన్ తో కూడా ఇవ్వవచ్చని
ఇక కెమెరా విభాగంలో, ఈ నోకియా 2.3 వెనుకభాగంలో ఒక 13MP ప్రధాన కెమెరాతో వస్తుంది. ఇక ముందు ఒక 5MP సెల్ఫీ కెమెరా కూడా అందుతుంది. గత సంవత్సరం, డిసెంబరు 5 వ తేదీకి నోకియా 8.1 ఫోన్ను విడుదల చేసింది. ప్రస్తుతం చేస్తున్న టీజింగ్ ప్రకారంగా, డిసెంబరు 5 న, నోకియా 8.2,నోకియా 5.2 మరియు నోకియా 2.3 ఫోన్నుకూడా లాంచ్ చేయవచ్చని అంచావేస్తున్నారు.