Moto E7 Plus: అల్ట్రా కెమేరా, స్టాక్ ఆండ్రాయిడ్ తో లాంచ్

HIGHLIGHTS

మోటరోలా తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్ Moto E7 Plus ‌ను భారత్‌లో విడుదల చేసింది.

గొప్ప కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ మరియు ప్రాసెసర్ ఈ మోటో ఇ 7 ప్లస్ యొక్క ప్రత్యేక ఫీచర్లు.

Moto E7 Plus ఎటువంటి బ్లోట్ వేర్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది

మోటరోలా తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్ Moto E7 Plus ‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌ ను కొద్ది రోజుల క్రితం బ్రెజిల్‌లో లాంచ్ చేశారు. గొప్ప కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ మరియు ప్రాసెసర్ ఈ ఫోన్ యొక్క ప్రత్యేక ఫీచర్లు. ఈ మోటో ఇ 7 ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 30 న మధ్యాహ్నం 12 నుండి అమ్మకానికి వస్తుంది. ఈ ఫోన్ మిస్టి బ్లూ మరియు ట్విలైట్ ఆరెంజ్‌ కలర్స్ లో లభిస్తుంది. భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ .9,499. ముఖ్యంగా, ఇది ఎటువంటి బ్లోట్ వేర్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది.  

Moto E7 Plus: స్పెసిఫికేషన్

మోటో ఇ7 ప్లస్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించబడింది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1600 x 720 పిక్సెల్ రిజల్యూషన్  మరియు 20: 9 ఎస్పెక్ట్ రేషియాతో వుంటుంది. గ్రాఫిక్స్ కోసం, ఈ ఫోన్ ‌లో క్వాల్‌కామ్ యొక్క 1.6 GHz స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్ మరియు అడ్రినో 610 GPU ఉన్నాయి. ఈ ఫోన్ ‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి, ఒక డేడికేటెడ్ మెమరీ కార్డ్ సహాయంతో స్టోరేజ్ మరింతగా విస్తరించవచ్చు. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 OS ‌పైన పనిచేస్తుంది. ఈ మోటో ఇ 7 ప్లస్ ఫోన్ ‌ను ఫింగర్ ప్రింట్ సెన్సార్ ‌తో కూడా లాంచ్ చేశారు.

Moto E7 Plus: కెమెరా

ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ మోటరోలా మోటో ఇ 7 ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ క్లైగి ఉంటుంది. ఇందులో, 48 మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరాని f / 1.7 ఎపర్చర్‌ తో కలిగి ఉంది. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెళ్ల డెప్త్ సెన్సార్ వుంటుంది. ఇక సెల్ఫీల కోసం, ఇది f / 2.2 ఎపర్చర్ గల 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ ‌ను శక్తివంతమైనదిగా చేయడానికి, ఈ ఫోన్‌ లో 5,000 mAh బ్యాటరీ ఉంది, ఇది 10 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్ ‌ను పూర్తి ఛార్జీతో ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఛార్జింగ్ కోసం మైక్రో USB పోర్ట్ కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 4 జి, బ్లూటూత్ వి 5, వై-ఫై, మైక్రో యుఎస్‌బి మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :