ఈ పండుగకు జియో బంపర్ ఆఫర్ : కేవలం రూ.699 రూపాయలకే ఫీచర్ ఫోన్
ఈ పరిమిత ఆఫర్ దసరా మరియు దీపావళి మధ్య మాత్రమే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.
జియో, ఇప్పుడు భారతీయా వినియోగదారులకోసం సరికొత్త జియో ఫోన్ దీపావళి 2019 పండుగ సేల్ ద్వారా జియో ఫోన్ 699 రూపాయల తగ్గింపు ధరలో విక్రయిస్తోంది. ఈ ఫీచర్ ఫోన్ను ఎటువంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకుండా డిస్కౌంట్ ధర వద్ద అమ్మనుంది. ఈ పరిమిత ఆఫర్ దసరా మరియు దీపావళి మధ్య మాత్రమే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.
1,500 రూపాయల ధరతో రిలయన్స్ జియోఫోన్ను భారత్లో లాంచ్ చేశారు. దీపావళి 2019 ఆఫర్ సందర్భంగా ఈ 4G ఫీచర్ ఫోన్ను రూ .699 కు ఆఫర్ చేస్తున్నారు. ఈ పండుగ సీజన్ సందర్భంగా ఈ ఫోన్ పైన 801 రూపాయల తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ ఆఫర్ యొక్క ప్రత్యేక విషయం ఏమిటంటే, వినియోగదారులు ఈ డిస్కౌంట్ రేటుతో కొనుగోలు చేయడానికి బదులుగా పాత ఫోన్ను ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.
699 రూపాయలకు జియోఫోన్ను కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులకు రూ .700 వరకు డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈఫోన్ ప్రారంభ 7 రీఛార్జిల కోసం కంపెనీ రూ .99 విలువైన అదనపు డేటాను కూడా అందిస్తుంది. వినియోగదారులు వినోదం, చెల్లింపు మరియు ఇ-కామర్స్ యాప్స్ కోసం ఈ అదనపు డేటాను ఉపయోగించవచ్చు.
స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ జియోఫోన్ ఒక 2.4-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. మరియు దీని డిజైన్ మార్కెట్లోని ఇతర ఫీచర్ ఫోన్ల మాదిరిగానే ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ KAI OS లో నడుస్తుంది మరియు స్ప్రెడ్ట్రమ్ 9820A లేదా డ్యూయల్ కోర్ క్వాల్కమ్ 205 ప్రాసెస్ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ జియో టివి, జియో సినిమా, జియో మ్యూజిక్ వంటి అనేక జియో యాప్లతో వస్తుంది.