Honor 200 Series: సినిమాటిక్ కెమెరాతో కొత్త సిరీస్ వస్తోంది.!
హానర్ కొత్తస్మార్ట్ ఫోన్ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది
హానర్ 200 సిరీస్ 5జి ఫోన్ లను త్వరలో విడుదల చేస్తోంది
పీస్ ఆఫ్ ఆర్ట్ పేరుతో ఈ ఫోన్ ను పిలుస్తోంది
Honor 200 Series: ఇండియాలో హానర్ కొత్తస్మార్ట్ ఫోన్ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అదే, హానర్ 200 సిరీస్ 5జి మరియు ఈ ఫోన్ లను అద్భుతమైన సినిమాటిక్ కెమెరాతో తీసుకొస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, పీస్ ఆఫ్ ఆర్ట్ పేరుతో ఈ ఫోన్ ను పిలుస్తోంది. అంటే, ఈ ఫోన్ డిజైన్ ను కలిగి ఉంటుందని చెప్పకనే చెబుతోంది.
SurveyHonor 200 Series:
హానర్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫోన్ లను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. హానర్ 200 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ లను గొప్ప కెమెరా సెన్సార్ మరియు దానికి తగిన సాఫ్ట్ వేర్ తో తీసుకు వస్తుందని చెబుతోంది. ఈ ఫోన్ లో కటింగ్ ఎడ్జ్ డిస్ప్లే టెక్నాలజీ ఉన్నట్లు హానర్ తెలిపింది. అయితే, వాస్తవానికి ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్లను ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో హానర్ విడుదల చేసింది. ఇప్పుడు ఇవే ఫోన్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు భావిస్తున్నారు.
Also Read: వెంటనే Mobile Recharge చేయండి.. లేదంటే రేపటి నుంచి వీపు విమానం మోత మోగిపోద్ది.!
Honor 200 Series: ఫీచర్లు (గ్లోబల్)
హానర్ 200 సిరీస్ నుండి గ్లోబల్ మార్కెట్ లో హానర్ 200 మరియు హానర్ 200 ప్రో రెండు ఫోన్లు విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా న్యూ స్టైల్ రియర్ కెమెరా బంప్ సెటప్ తో వచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా చూడచక్కని డిజైన్ మరియు గొప్ప కెమెరా సెటప్ ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాడ్ కర్వ్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్, 4K రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలను చిత్రించగల గొప్ప కెమెరాలను కలిగి ఉంటుంది.

ఇదే కాదు ఈ సిరీస్ ఫోన్ లలో వేగవంతమైన 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది మరియు 5100 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది. నిజం చెప్పాలంటే ఈ ఫోన్ సిరీస్ వాటి అందమైన డిజైన్ తో పాటు వేగవంతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వున్న కెమెరా కూడా ప్రత్యేకమైనది మరియు గొప్ప క్వాలిటీ పిక్చర్ లను అందిస్తుంది. ఇదంతా కూడా గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన హానర్ 200 సిరీస్ ఫోన్ ల ప్రత్యేకత.
భారత్ లో ఇదే ఫోన్ ను విడుదల చేస్తుందో లేక ఏదైనా మార్పులు చేస్తుందో అని వేచి చూడాల్సి వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile