ఆధార్ మోసాలతో జాగ్రత్త!! హెచ్చరిక జారీచేసిన UIDAI

Updated on 15-Jul-2021

ఆధార్ మోసాలతో జాగ్రత్త, అని ఆధార్ కార్డ్ ఉన్న ప్రతిఒక్కరిని కోసం అనేక అలర్ట్స్ UIDAI జారీ చేసింది. ప్రతి ఒక్కవిషయాన్ని షీషాల్ మీడియా పెట్టెయ్యడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. అయితే, ఆధార్‌ కు సంబంధించిన విషయాలను షోషల్ మీడియాలో షేర్ చెయ్యడం చాలా ప్రమాదమని UIDAI హెచ్చరించింది. ఆధార్ వినియోగదారులను ఎటువంటి సమాచారాన్ని కూడా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లోనూ షేర్ చేయవద్దని UIDAI అలర్ట్ జారీ చేసింది.

యుఐడిఎఐ యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి దీని గురించి వివరిస్తూ ట్వీట్ చేసింది. మనం దేశంలో అత్యంత ప్రధానమైన ఈ అధికారిక పత్రాన్ని గురించి జాగ్రత్తగా లేకుంటే భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తుంది. 

అలాగే, UIDAI కొత్త సంవత్సరంలో ఆధార్ కార్డ్ పైన కొత్త విధానం ప్రవేశపెట్టింది. అదే, PVC Aadhaar Card. ముందుగా, అందరికి అందించిన ఆధార్ కార్డ్ కేవలం ప్రింటెడ్ పేపర్ మాత్రమే. అందుకోసమే, ఈ PVC Aadhaar Card విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ATM కార్డ్ మాదిరిగా ఉంటుంది మరియు ఎక్కడైనా తీసుకెళ్లడానికి వీలుగా మీ జేబులో లేదా వాలెట్ లో సరిపోతుంది. ఈ PVC Aadhaar Card కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కేవలం రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది.

PVC ఆధార్ కార్డు కోసం ఎలా అప్లై చెయ్యాలి?

PVC ఆధార్ కార్డు కోసం అప్లై చెయ్యడం చాలా సులభం. దీనికోసం, UIDAI పోర్టల్ కి వెళ్లి My Aadhaar ట్యాబ్ నుండి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ తో PVC ఆధార్ కార్డు కోసం అప్లై చెయ్యవచ్చు.

1. https://uidai.gov.in/ వెబ్సైట్ కి వెళ్ళండి

2. MyAadhaar ట్యాబ్ పైన నొక్కండి

3. ఆర్డర్ ఆధార్ PVC కార్డ్ పైన నొక్కండి

4. ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది

5. ఇక్కడ మీ ఆధార్ నంబర్/వర్చువల్ ID/ EID తో లాగిన్ అవ్వండి

6. OTP మీ రిజిస్టర్ నంబర్ కు వస్తుంది.

ఈ విధంగా కేవలం రూ. 50 చెల్లించి మీ రిజిష్టర్ మొబైల్ ద్వారా మీ ఇంటి వద్దకే ATM కార్డ్ వంటి ఆధార్ PVC కార్డు ను తెప్పించుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి చాలా సింపుల్ గా ఆర్డర్ చేయవచ్చు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :