200 కు పైగా పట్టణాలలో JioMart ని లాంచ్ చేసిన రిలయన్స్ జియో
కస్టమర్లు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి jiomart.com కు లాగిన్ అవ్వవచ్చు.
ఈ సర్వీస్ ఇప్పుడు ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, డిల్లీ, బెంగళూరు, జైపూర్, త్రివేండ్రం మరియు మరికొన్ని టైర్ -2 నగరాల్లో కూడా యాక్టివ్ గా ఉంది
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన ఆన్లైన్ కిరాణా డెలివరీ సర్వీస్ – జియోమార్ట్ ను భారతదేశంలోని 200 కి పైగా పట్టణాల్లో అధికారికంగా ప్రారంభించింది. ఈ సర్వీస్ ఇప్పుడు ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, డిల్లీ, బెంగళూరు, జైపూర్, త్రివేండ్రం మరియు మరికొన్ని టైర్ -2 నగరాల్లో కూడా యాక్టివ్ గా ఉంది. ముంబైలో పరిమిత పిన్ కోడ్స్ కోసం పైలట్ సర్వీస్ నడిపిన తర్వాత రిలయన్స్ జియోమార్ట్ వెబ్సైట్ ను ఇప్పుడు Live చేసింది. కస్టమర్లు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి jiomart.com కు లాగిన్ అవ్వవచ్చు. అయితే, APP మాత్రం ఇంకా లైవ్ కాలేదని గమనించండి, కానీ ఇది త్వరలో రావచ్చు.
జియోమార్ట్ దేశవ్యాప్తంగా 200 కి పైగా పట్టణాల్లో కిరాణా సామాగ్రిని పంపిణీ చేయనున్నట్లు రిలయన్స్ రిటైల్ CEO దామోదర్ మాల్ శనివారం ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతానికి, జియోమార్ట్ వెబ్సైట్ అవసరమైన కిరాణా, FMCG వస్తువులు మరియు వ్యవసాయ ఉత్పత్తులను జాబితా చేసింది. వారి నుండి పండ్లు మరియు కూరగాయలను విక్రయించడానికి రైతులతో సహకరించినట్లు కంపెనీ తెలిపింది. లాక్డౌన్ పరిమితులు సడలించిన తర్వాత జియోమార్ట్ వెబ్సైట్లోని ఉత్పత్తి కేటలాగ్ విస్తరించబడుతుందని ఈ విషయం తెలిసిన ఒక వ్యక్తి రాయిటర్స్తో చెప్పారు.
జియోమార్ట్తో రిలయన్స్ ప్రస్తుత ఆన్లైన్ దిగ్గజాలైన అమెజాన్ ఇండియా, వాల్మార్ట్ యొక్క ఫ్లిప్కార్ట్ మరియు ఇతర ప్రముఖ మైక్రో డెలివరీ ప్లేయర్లైన BBDaily , గ్రోఫర్స్, మిల్క్బాస్కెట్ మరియు స్విగ్గీస్ సూపర్ డైలీలకు పోటీగా ఉండనుంది. రైతులను వ్యాపారాలకు అనుసంధానించే ఈ లేటెస్ట్ ప్రోడక్ట్ సప్లై చైన్, క్రోఫార్మ్ మరియు నిన్జాకార్ట్ వంటి ప్రస్తుత సప్లయర్స్ కు పోటీ అవుతుంది .
జియోమార్ట్: పోటీకి స్పష్టమైన ముప్పు
కరోనావైరస్ మహమ్మారితో దేశం దెబ్బతినడానికి ముందే జియోమార్ట్ ప్రవేశం ఆశ్చర్యం కలిగించదు. ఇప్పుడు, రోజువారీ నిత్యావసరాలు మరియు FMCG గూడ్స్ కోసం ఆన్లైన్ డిమాండ్ పెరుగుతున్నందున, రిలయన్స్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయంగా చూస్తుంది. "సంక్షోభాన్ని ఎప్పుడూ వృథా చేయకండి, అని చెబుతారు!" అని మాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అతను తన సహోద్యోగిని కోటింగ్ చేస్తూ అలీబాబా కేసును పంచుకున్నాడు, "SARS సంక్షోభం నుండి అలీబాబా కూడా అభివృద్ధి చెందింది" అని అన్నారు.
రిలయన్స్ జియో టెలికాం రంగానికి విఘాతం కలిగించడాన్ని మనం చూశాము మరియు 11,784 దుకాణాలను కలిగి ఉన్న అతిపెద్ద ఆఫ్లైన్ రిటైలర్గా మరియు జియో ప్లాట్ఫామ్లో భారీ మొత్తంలో యూజర్ బేస్ కలిగి ఉన్నాము; ఇది ఇప్పటికే చిన్న ప్లేయర్స్ ను తీసుకోవటానికి బాగా అమర్చబడి ఉంది. అధనంగా, జియోకు ఇటీవలే ఫేస్బుక్ నిధులు లభించాయి, మరియు ఇతర సంస్థలు మొత్తం 78,562 కోట్ల రూపాయల (సుమారుగా 7 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాయి.