ఫ్లిప్ కార్ట్ హోమ్ పేజిపైన ఒక కొత్త మైక్రో సైట్ ని అందిస్తోంది. దాన్ని నొక్కడంతో ఒక సరికొత్త "సూపర్ మార్ట్" పేజీకి తీసుకువెళుతుంది. దీని గురించి ఫ్లిప్ కార్ట్ ఏమిచెబుతుందంటే, గ్రోసరీ కోసం ఒక సరికొత్త "సూపర్ మార్ట్" పేజీని ఫ్లిప్ కార్ట్ అందిచనున్నట్లు మరియు త్వరలో దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధిచేయనున్నట్లు చెబుతోంది. అంతేకాదు, ప్రారంభ ఆఫర్ల క్రింద "Grocery From 1 Rs" అఫర్ క్రింద, ప్రతిరోజూ ఒక ప్రొడక్టును కేవలం ఒక్క రూపాయికే అందించనున్నట్లు కూడా తెలుస్తోంది.
అలాగే, ఇప్పుడు పప్పు, పప్పుధాన్యాలు, నూనెలు, గోధుమపిండి, బియ్యం, డ్రై ఫ్రూట్స్, పంచదార, బెల్లం, వంటి మరెన్నో అనేకమైన దినసరి సరుకులను మంచి క్వాలిటీతో పాటుగా తక్కువధరకే అందించనున్నట్లు తన పేజీలో ప్రకటించింది. ఇంకా, చిప్స్, బిస్కట్లు, టీ, కాఫీ మరియు కూల్ డ్రింక్స్ వంటి వాటిని కూడా వేగవంతమైన డెలివరీతో అందించనున్నట్లు కూడా తెలుస్తోంది.
ఇక ఈ రోజు సూపర్ మార్ట్ నుండి ఒక రూపాయి అఫర్ క్రింద ANANDA బ్రాండ్ 100 గ్రాముల నెయ్యి మరియు DHAMPUR బ్రాండ్ పంచదారని ప్రకటించింది. అలాగే, దాదాపుగా అన్నిరకాల ప్రొడక్టుల పైనా భారీ ఆఫర్లను మరియు గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే, ఈ ఒక్కరూపాయి ఆఫరును మీరు అందుకోవాలంటే మాత్రం 600 రూపాయల విలువగల వస్తువులను కొనుగోలుచేయాల్సి ఉంటుంది.