ఇండియాలో రెండు పవర్ ఫుల్ సౌండ్ బార్లను తీసుకొచ్చిన YAMAHA
ఈ సౌండ్బార్లు రెండూ Alexa అంతర్నిర్మితంతో వస్తాయి.
YAMAHA మ్యూజిక్ ఇండియా భారతదేశంలో కొత్త సౌండ్బార్లను విడుదల చేసింది. అవి – YAS 109 మరియు YAS 209. వీటిలో YAS 109 సౌండ్ బారువును రూ. 23,990 రూపాయల ధరతో మరియు YAS 209 సౌండ్ బారును రూ. 35,490 రూపాయల ధరతో తీసుకొచ్చింది. ఈ సౌండ్బార్లు రెండూ అలెక్సా అంతర్నిర్మితంతో వస్తాయి. ఈ రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, YAS 109 కు సబ్ వూఫర్ లేదు మరియు YAS 209 లో వైర్లెస్ సబ్ వూఫర్ ఉంది. రెండు సౌండ్బార్లు స్ఫోటిఫై మరియు అమెజాన్ మ్యూజిక్ వంటివాటికి అంతర్నిర్మిత మద్దతుతో వస్తాయి కాని Chromecast మాత్రం లేదు.
SurveyYAS 109 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఈ సౌండ్బార్ లో రెండు 2-⅛ అంగుళాల డ్రైవర్లు, రెండు 1-అంగుళాల ట్వీటర్ మరియు రెండు 3-అంగుళాల అంతర్నిర్మిత సబ్ వూఫర్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది మొత్తం 120 W విద్యుత్ ఉత్పత్తిని కలిగి ఉంది మరియు 3.4 కిలోల బరువుతో ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్బార్ లో HDMI ARC పోర్ట్ ఉంది, ఆప్టికల్ ఇన్, బ్లూటూత్ 4.2 మరియు వైఫై (2.4GHz మాత్రమే) ఉంటుంది. ఈ డివైజ్ పాస్త్రూ (50/60 Hz YCbCr = 4: 4: 4, HDR10, HLG మరియు HDCP2.3) కోసం ఒక HDMI పోర్ట్ను కలిగి ఉంది.
అలాగే, YAS 209 యొక్క స్పెసిఫికేషన్లను చూస్తే, ఈ సౌండ్బార్ లో నాలుగు 1-3 / 4 అంగుళాల డ్రైవర్లు మరియు రెండు 1-అంగుళాల ట్వీటర్లు ఉన్నాయి. ఇది 6-½ అంగుళాల వైర్లెస్ సబ్ వూఫర్ను కలిగి ఉంది. ఇది మొత్తం 200 W విద్యుత్ ఉత్పత్తిని కలిగి ఉంది. ఈ బార్ బరువు 2.7 కిలోలు మరియు సబ్ వూఫర్ 7.9 కిలోలు. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్బార్ లో HDMI ARC పోర్ట్ ఉంది, ఆప్టికల్ ఇన్, బ్లూటూత్ 4.2 మరియు వైఫై (2.4GHz మాత్రమే). ఈ పరికరం పాస్త్రూ (50/60 Hz YCbCr = 4: 4: 4, HDR10, HLG మరియు HDCP2.3) కోసం ఒక HDMI పోర్ట్ను కలిగి ఉంది.
యమహా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి, కీగన్ పేస్, ఈ లాంచ్ గురించి వ్యాఖ్యానిస్తూ, “యమహా మ్యూజిక్ YAS 109 మరియు YAS 209 సౌండ్బార్లు అంతర్నిర్మిత అలెక్సా వాయిస్ కంట్రోల్తో భారతీయ ఆడియో మార్కెట్లో కొత్త బెంచ్మార్క్ను నిర్దేశిస్తాయి. అలాగే, ఇమ్మర్సివ్ మరియు Life-Like ఆడియో అనుభవం, అల్ట్రా-స్లిమ్ డిజైన్ మరియు అధునాతన లక్షణాల యొక్క శక్తివంతమైన సమ్మేళనం, ఖచ్చితంగా సంగీత మరియు చలన చిత్ర ఔత్సాహికులకు ఒక విందుగా మారుతుంది. ” అని పేర్కొన్నారు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile