IPL సందర్భంగా LED టీవీల పైన గొప్ప ఎక్స్చేంజ్ అఫర్ ప్రకటించిన అమేజాన్ ఇండియా

Updated on 12-Mar-2019
HIGHLIGHTS

సోని టీవీల పైన అత్యదికంగా 25,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ అఫర్ చేస్తోంది.

అమేజాన్ ఇండియా IPL సందర్భంగా LED టీవీల పైన గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ సేల్ మార్చి 14 నుండి మొదలవుతుంది. ఇందులో భాగంగా, ప్రధాన టీవీ బ్రాండ్స్ అయినటువంటి Sony, LG, Panasonic, Mi మరియు ఇటువంటి అన్ని ప్రధాన బ్రాండ్స్ యొక్క టివిల పైన ఎక్స్చేంజ్ అఫర్ ని ప్రకటించింది. అమేజాన్ ఇండియా ఆన్లైన్ ప్లేట్ ఫారం పైన అందించిన ఒక ప్రత్యేక పేజీ పైన అందించిన వివరాల ప్రకారం, No Cost EMI, భారీ డిస్కౌంట్లు మరియు టీవీ ఎక్స్చేంజ్ పైన అత్యదికమైన తగ్గింపులు అందించనున్నట్లు కనబడుతోంది.

ముఖ్యంగా, Sony బ్రాండ్ టీవీల గొప్ప తగ్గింపులతో పాటుగా 25,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించండం చూస్తుంటే, కొనుగోలుధారులకి  ఈ సేల్ భారీగానే ప్రయోజనాలను చేకూర్చనున్నట్టు అనిపిస్తోంది. IPL సీజన్లో ఎప్పుడు కూడా టీవీల అమ్మకాలు జోరుగా సాగడం పరిపాటి. అయితే, ఈ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఇప్పుడు దీని పైన మరింత ద్రుష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

అలాగే, ఇక్కడ అందించిన వెబ్ పేజీలో OLED & QOLED టీవీల పైన దాదాపుగా 45% వరకు తగ్గింపును అందించనున్నట్లు చూపిస్తోంది. Sanyo యొక్క 65 అంగుళాల 4K ఆండ్రాయిడ్ టీవీ ధరను Rs _5,_00 ధరతో చూపిస్తోంది.  ధరను 14 వ తేదీ ప్రకటించనుంది. అలాగే, Sony, LG, Panasonic, Mi వంటి మరికొన్ని బ్రాండెడ్ టీవీల ధరలను కూడా 14 వ తేదీ ఆవిష్కరించనున్నట్లు ప్రకటిస్తోంది.                                            

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :