కరోనా వైరస్ ఎఫెక్ట్ : జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ భారీ డేటాతో

HIGHLIGHTS

ఇది రోజుకు 3 జిబి డేటాను అందిస్తుంది.

ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులకు అనుగుణంగా, రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రూ. 999 రూపాయల ధరతో  కొత్త ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ కంపెనీ వెబ్‌సైట్ ‌లో అందుబాటులో ఉంది. జియో యొక్క రూ .999 ప్లాన్‌ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఇది రోజుకు 3 జిబి డేటాను అందిస్తుంది. వినియోగదారులు ఈ ప్లానుతో మొత్తం 252GB డేటాను పొందుతారు. అదనంగా, డేటా అయిపోయిన తర్వాత, వినియోగదారులు 64Kbps వేగంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

ఇది కాకుండా, జియో నుండి జియోకు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ మరియు జియో నుండి నాన్-జియో నంబర్ కోసం 3,000 నిమిషాలు కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. దీనితో పాటు, JioTV, JioCinema మరియు JioNews యొక్క కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్  కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్లాన్ 3GB జియో డేటాతో సెగ్మెంట్‌లోని జియో వెబ్‌సైట్‌లో ఉంచబడింది. ఇక 28 రోజుల వ్యాలిడిటీ కోసం ఇదే విభాగంలో రూ .349 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. గూగుల్ పే లేదా పేటీఎం నుండి యూజర్లు మైజియో యాప్ లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ లేదా వెబ్‌సైట్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

కొత్త ప్లాన్‌తో పాటు, 84 రోజుల వ్యవధితో వచ్చే మరో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను జియో అందిస్తుంది. ఈ రెండు ప్లాను‌ రోజుకు వరుసగా 2 GB మరియు 1.5 GB డేటాను అందించే రూ .599 మరియు 399 రూపాయల ధరతో వస్తాయి మరియు 84 రోజుల వ్యవధి కలిగి ఉంటాయి. ఈ రెండు ప్లాన్స్ జియో మరియు ల్యాండ్‌లైన్ కాల్స్, 3,000 నాన్-జియో నిమిషాలు మరియు జియో నుండి రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు జియో యాప్‌ లకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తాయి.

రిలయన్స్ జియో రీఛార్జ్ గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :