నెలకు రూ.908 కడితే చాలు ఈ వన్ ప్లస్ 5G ఫోన్ మీ సొంతం..!

HIGHLIGHTS

వన్ ప్లస్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ EMI తో మీ సొంతం చేసుకోవచ్చు

నెలకు రూ.908 కడితే చాలు ఈ వన్ ప్లస్ 5G ఫోన్ మీ సొంతం అవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి తక్కువ EMI తో కొనుగోలు చేసే అఫర్ తో లభిస్తోంది

వన్ ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ ను చాలా ఈజీగా మీ పొందాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ న్యూస్. వన్ ప్లస్ ఇండియాలో లేటెస్ట్ గా లాంచ్ చేసిన 5G స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ EMI అఫర్ తో మీరు పొందవచ్చు. కేవలం నెలకు రూ.908 కడితే చాలు ఈ వన్ ప్లస్ 5G ఫోన్ మీ సొంతం అవుతుంది. వన్ ప్లస్ నార్డ్ CE 2 5G స్మార్ట్ ఫోన్ గురించే మనం మాట్లడుకుంటోంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి తక్కువ EMI తో కొనుగోలు చేసే అఫర్ తో లభిస్తోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు EMI ఆఫర్ల గురించి తెలుసుకోండి.

OnePlus Nord CE 2 5G: ధర మరియు EMI అఫర్

వన్ ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ముందుగా రూ.19,999 ధరతో అమ్మడువుతుండగా, ఈ ఫోన్ ను రూ.1000 రూపాయల డిస్కౌంట్ తో ప్రస్తుతం కేవలం రూ.18,999 రూపాయల ప్రారంభ ధరతో అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ను అమెజాన్ నుండి అన్ని ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ ల ద్వారా అతితక్కువ EMI అప్షన్ తో కొనుగోలు చేయవచ్చు. ప్రతినెలా EMI ధర కేవలం 908 రూపాయల నుండి ప్రారంభమవుతుంది మరియు ఇది బ్యాంక్ ను బట్టి మారవచ్చు.  అయితే, స్టాండర్డ్ EMI ల పైన కొంత మొత్తం వడ్డీ వసూలు చేయబడుతుంది కండిషన్లను జాగ్రత్తగా చదవండి. HDFC బ్యాంక్ కార్డ్స్ తో EMI పైన ఈ ఫోన్ కొనేవారికి 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here  

OnePlus Nord CE 2 5G : స్పెషిఫికేషన్స్

వన్ ప్లస్ యొక్క ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఇది P3 డిస్ప్లే  మరియు sRGB కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు నాచురల్ కలర్స్ ని ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రొసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.

ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పు తో వచ్చింది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 64MP ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ కలిగిన 2MP డెప్త్ కెమెరా మరియు 2MP మ్యాక్రో లెన్స్ ని కలిగి వుంటుంది.ముందుభాగంలో 16MP SonyIMX471 సెల్ఫీ కెమెరాని ఇచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన కలర్ OS తో నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :