రియల్మీ సంస్థ తన మొట్టమొదటి ఫ్లాగ్ షిప్ మొబైల్ ఫోనుగా, ముందుగా చైనాలో లాంచ్ చేసిన REALME X 2 Pro ను ఇప్పుడు కంపెనీ ఇండియా మార్కెట్లో లాంచ్ చేయడానికి నవంబరు 20 వ తేదిని ఖాయం చేసింది. ఇది చైనాలో ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోనుగా లాంచ్ చేయబడినా కూడా ఇది కేవలం మిడ్-రేంజ్ విభాగంలో కంపెనీ విడుదల చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోనుగా నిలచింది. అయితే, వినూత్నంగా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ కోసం టికెట్స్ ని bookmyshow నుండి అమ్ముడిచేస్తోంది.
ఈ టికెట్ కొనదలచిన వారు bookmyshow నుండి రూ.299 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఈవెంట్ న్యూ ఢిల్లీలోని నెహ్రు స్టేడియంలో జరగనుంది. అధనంగా, ఈవెంట్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి రూ. 2100 విలువగల బహుమతులను కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటిలో, రాలీమె పవర్ బ్యాంక్ మరియు 855 రూపాయల R-Pass, realme X2 pro కోసం వంటివి ఉండనున్నట్లు చెబుతోంది.
ఈ రియల్మీ ఎక్స్ 2 ప్రో ఫోనులో ఒక ప్రధాన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ చిప్ సెట్ ఇవ్వబడింది. ఇది కాకుండా, మీరు ఈ మొబైల్ ఫోనులోఒక 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కూడా పొందుతారు. అంతేకాదు, ఈ డిస్ప్లేని FHD + రిజల్యూషన్తో అందించింది. ఈ మొబైల్ ఫోన్లో, మీరు వన్ప్లస్ 7 ప్రో, వన్ప్లస్ 7 టి మరియు వన్ప్లస్ 7 టి ప్రో మొబైల్ ఫోన్ల మాదిరిగానే 90 Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ను అందుకుంటారు మరియు ఇది లిక్విడ్ కూలింగ్ ఫీచర్తో వస్తుంది. ముఖ్యంగా, ఇది ఒక 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో తీసుకొచ్చింది.
కెమెరా మొదలైన వాటి గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోన్లో మీకు క్వాడ్-కెమెరా సెటప్ లభిస్తోంది, ఇందులో మీకు 64 MP ప్రధాన కెమెరా లభిస్తోంది, ఇది కాకుండా మీరు 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటుగా ఒక 13MP టెలిఫోటో లెన్స్తో పాటు 2MP డెప్త్ సెన్సార్ను కూడా పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు ఫోన్లో ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ను కూడా అందించింది