itel నుంచి అతి తక్కువ ధరకే రెండు స్మార్ట్ ఫోన్లు లాంచ్ : ప్రారంభ ధర రూ.4,999

HIGHLIGHTS

అతితక్కువ ధరలో క్రొత్త స్మార్ట్ ఫోన్‌ను కోనాల్ని చూస్తున్న వారికీ శుభవార్త

itel భరతదేశంలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువ ధరకే విడుదల చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ కొనడానికి మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

అతితక్కువ ధరలో క్రొత్త స్మార్ట్ ఫోన్‌ను కోనాల్ని చూస్తున్న వారికీ శుభవార్త. itel భరతదేశంలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువ ధరకే విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కొనడానికి మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. టెక్ బ్రాండ్ ఇటెల్ భారతదేశంలో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంస్థ, 5,000 రూపాయల కన్నా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. ఇప్పుడు ఐటెల్ కొత్తగా itel A48 మరియు itel A25 Pro స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లను Android OS ‌తో చాలా తక్కువ ధరకె కొనుగోలు చేయవచ్చు.

itel A48 & itel A25 Pro ధర

ఈ సంస్థ భారతదేశంలో నాలుగు సంవత్సరాలు సేవలందించింది. కొత్త ఇటెల్ ఎ 48 ధర 5,999 రూపాయలు మరియు ఇటెల్ ఎ 25 ప్రో ధర రూ .4,999. రెండు కొత్త ఫోన్‌లలో 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. వాటిని గ్రేడేషన్ బ్లూ, గ్రేడేషన్ గ్రీన్, గ్రేడేషన్ పర్పుల్ మరియు గ్రేడేషన్ బ్లాక్ కలర్ వద్ద కొనుగోలు చేయవచ్చు. 

itel A48 స్పెషిఫికేషన్లు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల HD + డిస్‌ప్లే ఉంది. ఈ ఐపిఎస్ వాటర్‌డ్రాప్ డిస్ప్లేలో ఇన్-సెల్ టెక్నాలజీ మరియు మంచి స్క్రీన్ డిజైన్ కోసం 2.5 డి లెన్స్ ఉంటుంది. దీని 19.5: 9 ఎస్పెక్ట్ రేషియో మరియు 1560×720 పిక్సెల్స్ రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్) లో నడుస్తుంది మరియు ఇది 1.4GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 2GB RAM మరియు 32GB స్టోరేజ్ తో వస్తుంది మరియు మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు విస్తరించవచ్చు.

itel A25 ప్రో ఫీచర్స్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే ఉంది మరియు ఈ ఐపిఎస్ డిస్‌ప్లే యొక్క రిజల్యూషన్ 1280×720 పిక్సెల్స్. దీని వెనుక ప్యానెల్‌లో 5 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 9.0 (గో ఎడిషన్) తో వచ్చిన ఈ ఫోన్ 1.4GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది మరియు మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 32 జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్‌లో 3020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :