JIO ఈ టారిఫ్ ప్లాన్ లలో మార్పులు

Updated on 12-Nov-2017

డేటా వార్  కారణంగా, టెలికాం కంపెనీలు వారి  టారిఫ్ ప్లాన్ లను రివైజ్ చేయటం  ప్రారంభించాయి. ఒక కంపెనీ  ఒక కొత్త ప్లాన్ ను అందిస్తే, ఇంకొక కంపెనీ పాత ప్లాన్ ను రివైజ్ చేస్తుంది . గత కొన్ని రోజులుగా ఎయిర్టెల్ చాలాప్లాన్ లను సిద్ధం చేస్తోంది. ఐడియా, వొడాఫోన్ మరియు ఇతర కంపెనీలు కూడా తమ యూజర్స్ ని  కొత్త ప్లాన్ ల ద్వారా  పెంచాలని ప్రయత్నిస్తున్నాయి . దీపావళికి ముందు రిలయన్స్ జియో తన  టారిఫ్ ప్లాన్ లలో అనేక మార్పులు చేసింది. ఈ కంపెనీ  టారిఫ్ ప్లాన్ల ధరలు పెంచేసింది. దీని తర్వాత కంపెనీ పలు ప్లాన్లను రూపొందించింది.

రూ .149 ప్లాన్ : తన ప్లాన్ ల లో రిలయన్స్ జియో మొదటి మార్పు చేసిన  ప్లాన్ 149 రూపాయల ప్లాన్ . రూ 149 కోసం ప్లాన్ ఎంచుకున్న యూజర్ 28 రోజుల కు  2 GB కు బదులుగా 4 GB డేటాను పొందుతారు. కానీ ఈ డేటా వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంది.  కానీ ఈ డేటా అయిపోయిన తరువాత యూజర్స్ కి డేటా స్పీడ్ తగ్గుతుంది . 

309 రూ. ప్లాన్ : కంపెనీ 309 రూపీస్ ప్లాన్ లో  వాలిడిటీ తగ్గించి మరియు ఈ ప్లాన్ లో అందుబాటులో ఉన్న డేటాను తగ్గించింది.  ఫస్ట్ ఈ ప్లాన్ వాలిడిటీ 56  డేస్  మరి ఇప్పుడు 49 డేస్ వాలిడిటీ వస్తుంది ,దీనిలో ఇప్పుడు 49 జీబీ డేటా లభ్యం . 1జీబీ డేటా డైలీ లిమిట్ తో లభ్యం . 

399 రూ. ప్లాన్ :జియో  యొక్క ఈ ప్లాన్ ధర 399 రూ నుండి 459 రూపీస్ అయిపోయింది . దీనిలో యూజర్స్ కి 84 డేస్ వాలిడిటీ బదులు 70డేస్ వాలిడిటీ లభ్యం. దీనిలో 70 జీబీ డేటా అండ్ అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD అండ్ రోమింగ్ ఫ్రీ. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :