సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ 'సర్కారు వారి పాట' OTT రిలీజ్ డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కలక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా OTT లో అమెజాన్ ద్వారా రెంటల్ కోసం పే ఫర్ వ్యూ అప్షన్ తో అందుబాటులోకి వచ్చినా కూడా థియేటర్లలో కూడా విజయయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క ఈ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ OTT లో సబ్ స్క్రైబర్స్ అందరికి అందువట్లోకి వస్తోంది. సర్కారు వారి పాట సినిమా సబ్ స్క్రైబర్స్ అందరి కోసం జూన్ 23న రిలీజ్ అవుతోంది. అయితే, అప్పటి వరకూ ఆగలేము అనుకునే వారికి 199 రూపాయల రెంట్ చెల్లించి చూసే విదంగా పే ఫర్ వ్యూ అప్షన్ తో సర్కారు వారి పాట సినిమాను చూడవచ్చు.
మే 2న థియేటర్లలో విడుదలై భారీ కలక్షన్స్ సాధించిన సర్కారు వారి పాట సినిమా OTT రైట్స్ ను అమెజాన్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది. ముందుగా, ఈ సినిమాను జూన్ 2 నుండి రెంటల్ అప్షన్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చింది. విడుదలకు ముందునుండే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ సాధించడమే కాకుండా బ్లాక్ బాస్టర్ మూవీగా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ అందరి కోసం జూన్ 23న రిలీజ్ అవుతోంది.
ఎప్పుడు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ తో ముందుకొచ్చే మహేష్ బాబు ఈ సారి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రస్తుతం సమాజంలో వున్న మరియు సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంభీరమైన విషయాన్ని గురించి చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశారు. పరుశురామ్ దర్శత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా కొనియాడబడింది.