ఒకవేళ మీరు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom) నెట్వర్క్ ని ఉపయోగిస్తుంటే, మీకు బ్యాడ్ న్యూస్ . డిసెంబరు 1 నుండి రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన వాయిస్ కాలింగ్ సేవను మూసివేస్తుంది . ఈ సమాచారం టెలికాం అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) చే ఇవ్వబడింది. కంపెనీ సుదీర్ఘకాలం గా నష్టాలలో పనిచేస్తుందని వివరించింది , అందుకే కంపెనీ డిసెంబర్ 31 నుండి RCOM యొక్క వాయిస్ కాలింగ్ సర్వీస్ ను మూసివేయాలని నిర్ణయించింది. కంపెనీ తన వినియోగదారులకు ఇంటర్నెట్ ని అందించలేకపోతుందని దాని ప్రకటనలో పేర్కొంది.ట్రాయ్ తన ఆదేశాలలో మాట్లాడుతూ, కంపెనీ వాయిస్ సర్వీసును మూసివేస్తామని ఆర్.కమ్ చెప్పినట్లు చెప్పారు. అలాంటి సందర్భంలో, డిసెంబర్ 1, 2017 తర్వాత, కంపెనీ యొక్క వాయిస్ కాలింగ్ సర్వీస్ పూర్తిగా మూసివేయబడుతుంది మరియు వినియోగదారులు వాయిస్ కాల్స్ చేయలేరు. ప్రస్తుతం తన 4 జి డేటా సర్వీస్ కొనసాగుతుందని ఆర్కమ్ తెలిపింది.
కంపెనీ డేటా సర్వీస్ ను ఉపయోగించని వినియోగదారులు , వారు వారి నెంబర్ ను మరొక నెట్వర్క్కి పోర్ట్ చేసుకోవచ్చు . RCom యొక్క వినియోగదారులు ఆ సమయంలో ఇతర నెట్వర్క్లలో వారి నంబర్స్ ని ను పోర్ట్ చేయకపోతే, అప్పుడు వారు రిలయన్స్ నెట్వర్క్ నుంచి కాల్ చేయలేరు.అదే సమయంలో, ట్రాయ్ RCOM ను నంబర్ పోర్ట్ చేయడానికి ఏ రిక్వెస్ట్ ని రద్దు చేయవద్దని కోరింది మరియు TRAI డిసెంబరు 31 కి ముందు RCom కస్టమర్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీను ఆమోదించడానికి ఇతర టెలికాం కంపెనీలను కోరింది.ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రంగాల్లో 2 జి, 4 జి సర్వీసులున్నాయని ఆర్ఆమ్ ట్రాయ్ కి తెలియజేసింది.అదే సమయంలో ఢిల్లీ, రాజస్థాన్, యుపి వెస్ట్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్ మరియు కోల్కతా వంటి సర్కిల్స్ లో 4G సేవలను పంపిణీ చేయటానికి సిస్టామా శ్యామ్ టెలి సర్వీసెస్ CDMA నెట్వర్క్ను ని అప్గ్రేడ్ చేస్తుంది .